Karnataka : ప్రియుడితో భార్య పారిపోయిందని పిల్లల్ని చంపిన భర్త

ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య వేరే ప్రియుడితో పారిపోయిందని మనస్తాపం చెందిన వ్యక్తి తన ఇద్దరు పిల్లల్ని హత్య చేసి పోలీసులకు లొంగిపోయిన ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది.

Karnataka : ప్రియుడితో భార్య పారిపోయిందని పిల్లల్ని చంపిన భర్త

Kalaburagi Auto Driver

Karnataka :  ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య వేరే ప్రియుడితో పారిపోయిందని మనస్తాపం చెందిన వ్యక్తి తన ఇద్దరు పిల్లల్ని హత్య చేసి పోలీసులకు లొంగిపోయిన ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది. కలబురిగి లోని వెదురు మార్కెట్,  భోవి గల్లిలో నివసించే లక్ష్మీకాంత్ (34) ఆటో నడుపుకుని జీవనం సాగిస్తున్నాడు. అతను  కొన్నేళ్ల కిందట అంజలి అనే మహిళను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వారికి నలుగురు పిల్లలు పుట్టారు.

ఈక్రమంలో అంజలి మరోక వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. నాలుగు నెలల క్రితం అంజలి పిల్లల్ని,మొగుడ్ని వదిలేసి తన ప్రియుడితో పారిపోయింది. లక్ష్మీ‌కాంత్ పిల్లల్ని తన అత్తగారింటి వద్ద దింపాడు. అప్పటి నుంచి మద్యానికి బానిసయ్యాడు.  ఈ క్రమంలో లక్ష్మికాంత్ మంగళవారం తన పిల్లల వద్దకు వెళ్లాడు. వారిలో పదేళ్ల సోని, ఎనిమిదేళ్ల మయూరి అనే ఇద్దరు ఆడ పిల్లలను తన ఆటోలో పార్క్‌కు తీసుకు వెళ్లాడు.  అక్కడ గొంతు పిసికి వారిని హత్య చేశాడు.

వారి మృతదేహాలను ఆటోలో సీటు కింద ఉంచి ఆరోజంతా ఆటో నడిపి ప్రయాణికులను ఎక్కించుకున్నాడు. ఆటో ఎక్కిన ప్రయాణికులకు తెలియదు…తాము కూర్చున్న సీటు కింద మృతదేహాలు ఉన్నాయని.  కాగా.. లక్ష్మికాంత్ బుధవారం మధ్యాహ్నం ఆటోలోని మృతదేహాలతో సహా ఎంబి నగర్ పోలీసు‌ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యప్తు చేస్తున్నారు.

Also Read : Mumbai Kidnap : వారం రోజులుగా కిడ్నాపర్ల చెరలో జగిత్యాల వాసి