Telangana : ‘బారిష్ పూజ’ చేస్తే డబ్బులు పెరుగుతాయి అంటూ బురిడీ.. రూ.12లక్షలతో ఉడాయించిన దొంగ బాబా

Telangana : ‘బారిష్ పూజ’ చేస్తే డబ్బులు పెరుగుతాయి అంటూ బురిడీ.. రూ.12లక్షలతో ఉడాయించిన దొంగ బాబా

Another Fake Baba Cheating In Karimnagar (1)

fake Baba cheating Rs.12 Lakhs : పూజలు చేస్తే డబ్బులు పెరుగుతాయని..బంగారం రెండింతలు అవుతుందని నమ్మించి అందినకాడికి దోచుకునిపోయే మోసగాళ్ల ఘటనలు ఎన్ని జరిగినా ప్రజల్లో మాత్రం అవగాహన రావటంలేదు. బాబాల పేరుతో ఎన్ని మోసాలు, దగాలు, దోపిడీలు జరిగినా ఇంకా జనాలు మోసపోతునే ఉన్నారు. ఈక్రమంలో తాజాగా కరీంనగర్ లో మరో దొంగబాబు బాగోతం బయటపడింది. మహారాష్ట్రనుంచి వచ్చిన ఓ దొంగబాబు ‘బారిష్ పూజ’పేరుతో కొంతమంది వ్యక్తులను బురిడీ కొట్టించాడు. ‘బారిష్ పూజ’ చాలా ప్రత్యేకమైనది అని నమ్మించాడు.డబ్బు వర్షంలా కురుస్తుంది అని నమ్మించాడు.

‘బారిష్ పూజ’ చేస్తే డబ్బులు రెండింతలు అవుతుంది అని నమ్మించాడు.దీంతో ముగ్గురు వ్యక్తులు అతని మాయలో పడ్డ వీరయ్య, మహేందర్,రాజయ్యలు డబ్బును పోగొట్టుకుని ఉసూరుమంటున్నారు. వీరు ముగ్గురు తమ వద్ద ఉన్న డబ్బును ఓ చోట పెట్టి మొత్తం రూ.12లక్షలు దొంగబాబాకు సమర్పించుకున్నారు. మీ రూ.12 లక్షల్ని కోటి రూపాయలు చేసి మీకిస్తాను అని నమ్మబలికాడు. ఆ మాటలకే తమకు కోటి రూపాయలు వచ్చేసినంత సంబరపడిపోయారు వీరయ్య, మహేందర్,రాజయ్యలు. డబ్బులు తీసుకుని తన పాచిక పారింది..చేతికి డబ్బు అందిందని సంతోషించాడు బాబా. అంతే ముగ్గురు ఇచ్చిన మొత్తం రూ.12లక్షలు తీసుకుని వారి చేతిలో ఓ నూనె సీసా పెట్టి తన పరివారంతో పరారయ్యాడు.

కానీ ఎంతకూ బాబా జాడ లేకపోయేసరికి మోసపోయామని గ్రహించిన ముగ్గురు బాధితులు గంగాధరం మండలం పోలీసులకు ఫిర్యాదు చేశారు. బారిష్ పూజ గురించి పోలీసులకు వివరించారు. ప్రేమచంద్ అనే వ్యక్తి దొంగబాబాకు తమకు మధ్య మధ్యవర్తిగా ఉన్నాడంటూ చెప్పుకొచ్చారు. దీంతో దొంగబాబాపై కేసు నమోదుచేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.