Haryana : పెళ్లి ఉంది..కారును మెళ్లిగా పొమ్మన్నారు, ఇద్దరిని చంపేశాడు

రే బాబు పెళ్లి ఉంది..జనాలు ఉన్నారు..కారును మెల్లిగా పోనివ్వు..అన్న పాపానికి...ఆ వ్యక్తి ఏకంగా రివర్స్ లో కారు నడుపుతూ..అక్కుడున్న వారిపై ఎక్కించేశాడు.

Haryana : పెళ్లి ఉంది..కారును మెళ్లిగా పొమ్మన్నారు, ఇద్దరిని చంపేశాడు

Haryana

Asked To Drive Slow : అరే బాబు పెళ్లి ఉంది..జనాలు ఉన్నారు..కారును మెల్లిగా పోనివ్వు..అన్న పాపానికి…ఆ వ్యక్తి ఏకంగా రివర్స్ లో కారు నడుపుతూ..అక్కుడున్న వారిపై ఎక్కించేశాడు. ఈ ఘటనలో ఇద్దరు చనిపోయారు. దీంతో పెళ్లి మంటపంలో మోగాల్సిన పెళ్లి భాజాల స్థానంలో చావు డప్పులు మోగాయి. ఈ ఘటన ఆ కుటుంబంలోనే కాకుండా…స్థానికంగా విషాదాన్ని నింపింది. హర్యాణాలోని కర్నాల్ ప్రాంతంలో విషాద ఘటన చోటు చేసుకుంది.

Read More : Blade Batch : విజయవాడలో బ్లేడ్ బ్యాచ్ వీరంగం

కర్నాల్ లో నిలోఖేరి ప్రాంతంలో అజయ్ కుర్రోడు…కారును ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ..అక్కడున్న వారిని భయబ్రాంతులకు గురి చేసేవాడు. ఈ ప్రాంతంలో ఓ ఇంట్లో శుభకార్యం జరుగుతోంది. దీంతో అజయ్ వల్ల ఏదైనా ప్రమాదం జరుగుతుందని ఆ కుటుంబం భావించింది. కారును మెల్లిగా నడుపుకోవాలని..ఇంట్లో ఫంక్షన్ జరుగుతోందని చెప్పారు. అదే సమయంలో కారును వేగంగా రివర్స్ చేస్తూ..అక్కడున్న వారిపైకి పోనిచ్చాడు అజయ్. ఐదుగురిలో ఇద్దరు చనిపోయారు.

Read More : Tragedy : ఇద్దరు పిల్లలను ఉరి వేసి చంపిన తల్లి

చనిపోయిన వారిలో ఓ యువతి ఉంది. చికిత్స పొందుతూ వ్యక్తి చనిపోయాడు. తాము కారును మెల్లిగా నడపాలని కోరడం జరిగిందని, తన కొడుకు ఇష్టమొచ్చినట్లు డ్రైవింగ్ చేస్తాడు అని అజయ్ చెప్పాడని బాధిత యువతి బంధువు వెల్లడించారు. సమాచారం అందుకున్న పోలీసులు అజయ్..అతని తండ్రిపై హత్యానేరం కింద కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న తండ్రి కొడుకులను పట్టుకొనేందుకు ఐదు బృందాలు ఏర్పాటు చేయడం జరిగిందని పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు.