Karimnagar : సెల్పీ మోజులో కాలువలో పడ్డ ఫోన్ …. ఫోన్ కోసం కాలువలో దిగి యువకుడు గల్లంతు
కరీంనగర్ జిల్లాలో విహారంలో విషాదం చోటు చేసుకుంది. సెల్ఫీ తీసుకునే క్రమంలో సెల్ ఫోన్ నీటిలో పడిపోయింది. అది తీసే క్రమంలో ఒక యువకుడు ప్రవాహా వేగానికి కొట్టుకుపోయాడు.
Karimnagar : కరీంనగర్ జిల్లాలో విహారంలో విషాదం చోటు చేసుకుంది. సెల్ఫీ తీసుకునే క్రమంలో సెల్ ఫోన్ నీటిలో పడిపోయింది. అది తీసే క్రమంలో ఒక యువకుడు ప్రవాహా వేగానికి కొట్టుకుపోయాడు.
హుజూరాబాద్ మండలం సింగపూర్ కిట్స్ కళాశాలలో బీటెక్ మూడవ సంవత్సరం చదువుతున్న ఆరుగురు విద్యార్ధులు సోమవారం సాయంత్రం ఎస్ఆర్ఎస్పీ కాలవపై ఉన్న మిషన్ బగీరథ పైప్ లైన్ల వద్దకు విహారానికి వెళ్లారు. అక్కడ ఉండి సెల్ఫీ ఫోటోలు దిగుతుండగా ఒకరి ఫోన్ జారి కాలువలో పడిపోయింది.
అది తీయటంకోసం నవనీత్ అనే విద్యార్ధి నీళ్లలోకి దిగాడు. ఫోన్ తీసే క్రమంలో నీటిప్రవాహం ధాటికి కొట్టుకు వెళ్లిపోయాడు. మిగిలిన ఐదుగురు విద్యార్ధులు వడ్డుకు చేరుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు.
Also Read : Tirupati Murder : మద్యం మత్తులో మర్డర్ చేశానన్నాడు…హత్య చేసిన ప్రత్యర్ధులు
ఘటనా స్ధలానికి వచ్చిన పోలీసులు కేసు నమోదు చేసుకుని విద్యార్ధుల వద్ద సమాచారం తెలుసుకున్నారు. గల్లంతైన విద్యార్ధి నవనీత్ కోసం గాలింపు చేపట్టారు.