Manish Sisodia : తీహార్ జైల్లో ఉన్న మనీశ్ సిసోడియాపై సీబీఐ మరో కేసు నమోదు

లిక్కర్ స్కామ్ కేసులో ఇరుక్కున్న ఆప్ నేత, ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాపై సీబీఐ మరో కేసు నమోదు చేసింది. ఫీడ్ బ్యాక్ యూనిట్ లో జరిగిన అవకతవకలపై సీబీఐ మనీశ్ సిసోడియాతో సహా ఏడుగురిపై కేసులు నమోదు చేసింది.

Manish Sisodia : తీహార్ జైల్లో ఉన్న మనీశ్ సిసోడియాపై సీబీఐ మరో కేసు నమోదు

FBU..CBI Registers FIR Manish Sisodia

FBU..CBI Registers FIR Manish Sisodia : లిక్కర్ స్కామ్ కేసులో ఇరుక్కున్న ఆప్ నేత, ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాపై సీబీఐ మరో కేసు నమోదు చేసింది. ఫీడ్ బ్యాక్ యూనిట్ లో జరిగిన అవకతవకలపై సీబీఐ మనీశ్ సిసోడియాతో సహా ఏడుగురిపై కేసులు నమోదు చేసింది. స్నూపింగ్‌ ఆరోపణల కేసుకు సంబంధించి మనీష్ సిసోడియాతో పాటు మరో ఏడుగురిపై సీబీఐ ఎఫ్ఐఆర్ దాఖలు చేసింది.

అవినీతిని అరికట్టటానికి ఏర్పాటు చేసిన ఫీడ్‌బ్యాక్ యూనిట్ (FBU) ద్వారా ‘‘రాజకీయ ఇంటెలిజెన్స్’’(ప్రత్యర్థి పార్టీలు, ప్రభుత్వ అధికారులపై నిఘా) సేకరించినట్లు ఆరోపించిన కేసులో మనీష్ సిసోడియాపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని సీబీఐ ప్రాథమిక విచారణలో తేలిందని సీబీఐ పేర్కొంది. సీబీఐ విచారణకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఇప్పటికే అనుమతి కూడా మంజూరు చేసింది.

అవినీతి నిరోధక చట్టం, 1988లోని సెక్షన్ 17 ప్రకారం సిసోడియాను ప్రాసిక్యూట్ చేయటానికి అనుమతి లభించిందని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ కు ప్రిన్సిపల్ సెక్రటరీకి పంపిన కమ్యూనికేషన్ లో హోంమంత్రిత్వ శాఖ పేర్కొంది. అవినీతిని అరికట్టేందుకు ఢిల్లీ ప్రభుత్వం 2015లో ఏర్పాటు చేసిన ఫీడ్‌బ్యాక్ యూనిట్ (FBU) రాజకీయ నిఘాని సేకరించినట్లుగా సీబీఐ తన ప్రాథమిక విచారణలో తేలిందని గత నెలలో సీబీఐ పేర్కొంది. దీంతో సిసోడియాపై ఎఫ్‌ఐఆర్‌ నమోదుకు సిఫార్సు చేసింది.

కాగా..ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్‌ ఆద్మీ ప్రభుత్వం 2015లో ఎఫ్‌బీయూ ఏర్పాటును ప్రతిపాదించింది. ఢిల్లీ గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ (GNCTD) పరిధిలోకి వచ్చే వివిధ విభాగాలు మరియు స్వయంప్రతిపత్త సంస్థలు, సంస్థల పనితీరుకు సంబంధించి సమాచార సేకరణ, తగిన చర్యలను తీసుకునేలా అభిప్రాయాన్ని వ్యక్తం చేయడానికి ఎఫ్‌బీయూ ఏర్పాటుకు సంకల్పించారు. సీక్రెట్ సర్వీసు ఖర్చుల కోసం రూ. 1 కోటి కేటాయించడంతో ఈ FBU 2016లో పని చేయడం ప్రారంభించింది.

అయితే 2015లో జరిగిన క్యాబినెట్ సమావేశంలో ఢిల్లీ సీఎం అరివింద్ కేజ్రీవాల్ ఈ ప్రతిపాదనను ముందుకు తెచ్చారని..అయితే ఎజెండా నోట్ ఏదీ సర్క్యులేట్ కాలేదని సీబీఐ ఆరోపిచింది. FBUలో నియామకాల కోసం లెఫ్టినెంట్ గవర్నర్ నుంచి ఎటువంటి అనుమతి తీసుకోలేదని సీబీఐ పేర్కొంది. నియామకాల కోసం లెఫ్టినెంట్ గవర్నర్ నుంచి ఎటువంటి అనుమతి తీసుకోలేదని పేర్కొంది.