Arvind Kejriwal : కోర్టుకు ఈడీ, సీబీఐ తప్పుడు సమాచారం.. దర్యాప్తు సంస్థల తీరుపై కేజ్రీవాల్ అసహనం

ఢిల్లీలో అసలు లిక్కర్ స్కామ్ అనేదే జరగలేదని కేజ్రీవాల్ అన్నారు. భారత్ లో కొన్ని దేశ వ్యతిరేక శక్తులు ఉన్నాయని.. దేశం అభివృద్ధి చెందకుండా చేస్తున్నాయని ఆరోపించారు.

Arvind Kejriwal : కోర్టుకు ఈడీ, సీబీఐ తప్పుడు సమాచారం.. దర్యాప్తు సంస్థల తీరుపై కేజ్రీవాల్ అసహనం

Arvind Kejriwal

Arvind Kejriwal : ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ కు సీబీఐ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. నోటీసులు జారీ కావడంతో కేజ్రీవాల్ ఆదివారం సీబీఐ ముందు హాజరు కానున్నారు. కాగా, దర్యాప్తు సంస్థలపై కేజ్రీవాల్ ఆరోపణలు చేశారు. దర్యాప్తు సంస్థల తీరుపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. కోర్టు ముందు ఈడీ, సీబీఐలు తప్పుడు సమాచారం ఇస్తున్నారని పేర్కొన్నారు. ఈడీ విచారణలో కొందరి పేర్లు చెప్పాలని చందన్ రెడ్డిని టార్చర్ చేశారని ఆరోపించారు. ఇప్పటివరకు లిక్కర్ కేసులో అరెస్టయిన వాళ్ళను దర్యాప్తు సంస్థలు టార్చర్ పెట్టి, వేధిస్తున్నాయని వెల్లడించారు.

100 కోట్ల రూపాయలు అంటున్నారు కానీ, ఒక్క పైసా కూడా దొరకలేదన్నారు. ఆదివారం సీబీఐ ముందు మోడీకి వెయ్యి కోట్ల రూపాయలు ఇచ్చానని చెప్తే నమ్ముతారా? విచారణ చేస్తారా? అని ప్రశ్నించారు. కొత్త పాలసీ వల్ల 50 శాతం ఆదాయం పెరిగిందన్నారు. లిక్కర్ స్కాం అనేదే లేదని స్పష్టం చేశారు. కావాలని కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఆమ్ ఆద్మీ పార్టీని టార్గెట్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీలోని ఒక్కొక్కరిని కేసుల్లో ఇరికిస్తున్నారని వెల్లడించారు.

Delhi liquor scam: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు షాక్.. లిక్కర్ స్కాంలో సీబీఐ నోటీసులు

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కేజ్రీవాల్ కు సీబీఐ నోటీసులు ఇచ్చింది. ఈ కేసులో కేజ్రీవాల్ నుంచి కూడా సీబీఐ వివరాలు రాబట్టాలని నిర్ణయిచింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆదివారం ఏప్రిల్16న ఉదయం 11 గంటలకు విచారణకు రావాలని కేజ్రీవాల్ సీబీఐ ఆదేశించింది. ఢిల్లీలో అసలు లిక్కర్ స్కామ్ అనేదే జరగలేదని కేజ్రీవాల్ అంటున్నారు. భారత్ లో కొన్ని దేశ వ్యతిరేక శక్తులు ఉన్నాయని.. దేశం అభివృద్ధి చెందకుండా చేస్తున్నాయని ఆరోపించారు.

దేశంలో పేదలు, దళితులకు నాణ్యమైన విద్య అందకూడదని భావిస్తున్నాయని తెలిపారు. ఆ శక్తులే మనీశ్ సిసోడియాను జైలుకు పంపాయని పేర్కొన్నారు. ఆయనను జైలుకు పంపిన వారు దేశానికి శత్రవులు అని వ్యాఖ్యానించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ జరుగలేదని.. కేంద్ర ప్రభుత్వం కుట్రపూరితంగా పలు చర్యలకు పాల్పడుతోందని ఆప్ నేతలు విమర్శిస్తున్నారు.

Manish Sisodia ED Custody : ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మనీశ్ సిసోడియా కస్టడీ పొడిగింపు

సీబీఐ, ఈడీని వాడుకుంటూ రాజకీయ ప్రయోజనాలు పొందాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోందని విమర్శలు చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పటికే సీబీఐ, ఈడీ పలువురు ప్రముఖులను అరెస్టు చేసింది. ఇదే కేసులో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా జైలులో ఉంటూ విచారణ ఎదుర్కొంటున్నారు. అలాగే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను కూడా ఇటీవలే ఈడీ ప్రశ్నించింది. ఇప్పటివరకు జరిగిన విచారణలో అనేక విషయాలు వెలుగుచూశాయి.