Afghanistan : అప్ఘానిస్తాన్‌‌లోని ఓ మసీదులో భారీ పేలుడు.. 100 మందికి పైగా మృతి

అప్ఘానిస్తాన్ లో మరోసారి భారీ పేలుడు సంభవించింది.

Afghanistan : అప్ఘానిస్తాన్‌‌లోని ఓ మసీదులో భారీ పేలుడు.. 100 మందికి పైగా మృతి

Afghan (14)

Afghanistan : ఉత్తర అఫ్గనిస్తాన్‌లో భారీ బాంబు పేలుడు సంభవించింది. కుందూస్‌ నగరంలోని షియా మసీదును లక్ష్యంగా చేసుకొని బాంబు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో 100 మందికి పైగా మృతిచెందారు. సుమారు 200 మంది గాయాలపాలయ్యారు. శుక్రవారం ప్రార్థనలు జరుగుతుండగా పేలుడు సంభవించింది. దాడికి పాల్పడింది ఇస్లామిక్‌ స్టేట్‌ ఆఫ్‌ ఖొరాసాన్‌గా అనుమానం వ్యక్తమవుతోంది. కొద్దిరోజులుగా షియాలకు ఐసిస్‌ ఖొరాసాన్‌ హెచ్చరికలు చేస్తోంది. కొద్ది రోజుల క్రితం ఐసిస్‌ ఖొరాసాన్‌.. తాలిబన్ల నాయకుడి తలనరికిన విషయం తెలిసిందే.

ALSO READ Maa Elections : మంచు విష్ణుకు కోట సపోర్ట్.. ప్రకాశ్ రాజ్‌పై తీవ్ర విమర్శలు