Telangana : లైంగిక దాడి చేసిన స్నేహితుడు-ఆ వీడియోలు వైరల్ చేస్తానని బ్లాక్ మెయిల్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఒక మహిళపై అత్యాచారం చేసిన వ్యక్తి అందుకు సంబంధించిన వీడియోలతో మహిళను బ్లాక్ మెయిల్ చేయసాగాడు. బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు
Telangana : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఒక మహిళపై అత్యాచారం చేసిన వ్యక్తి అందుకు సంబంధించిన వీడియోలతో మహిళను బ్లాక్ మెయిల్ చేయసాగాడు. బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయటంతో పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు.
వివరాల్లోకి వెళితే … దమ్మపేట మండలం మందలపల్లికి చెందిన కే.అమర్ (25) అనే వ్యక్తి, వారి ఇంటి ఎదురుగా ఉన్న దుర్గ(27) అనే మహిళను ప్రేమించాడు. తన కంటే వయస్సులో చిన్నవాడివి అని ఆమె ప్రేమను తిరస్కరించింది. అయినా ఆమె వెంటపడటంతో అతనితో స్నేహంగా మాట్లాడసాగింది. కానీ అతను అది ప్రేమ అనుకుని మహిళపై ఆధిపత్యం చెలాయించసాగాడు.
మొత్తానికి ఆ మహిళ అమర్కు నచ్చ చెప్పింది. ఒకరోజు ఇంట్లో ఎవరూ లేని సమయంలో దుర్గ ఇంటికి వచ్చిన అమర్ …రేపటి నుంచి కలవను అని చెప్పి ఆమెకు మత్తు మందు కలిపిన కూల్ డ్రింక్ ఇచ్చి తాగించాడు. కూల్ డ్రింక్ తాగిన దుర్గ స్పృహ తప్పి పడిపోవటంతో ఆమెపై లైంగికదాడి చేసి దాన్నంతా ఫోటోలు వీడియోలుగా చిత్రీకరించాడు.
అయితే ఇటీవల ఆమెకు మరోక వ్యక్తితో వివాహం నిశ్చయం అయ్యింది. అప్పటి నుంచి అమర్ ఆమెను బ్లాక్ మెయిల్ చేయటం ప్రారంభించాడు. మొదట వారిద్దరూ సన్నిహితంగా ఉన్న ఫోటోలను ఆమెకు కాబోయే భర్తకు పంపించాడు. రూ.5 లక్షలు ఇవ్వకపోతే ఆ వీడియోలను కూడావైరల్ చేస్తానని బెదిరింపులకు గురిచేశాడు.
Also Read :Gang Rape : పల్నాడులో ఒడిషా మహిళపై గ్యాంగ్ రేప్
చేసేదేమిలేక బాధితురాలు దమ్మపేట పోలీసులకు శుక్రవారం రాత్రి ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అమర్ తో పాటు అతని స్నేహితులు ధర్మారావు, అనిల్ వెంకటేశ్ లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.