బాలికను కిడ్నాప్ చేసి హత్య చేసిన సవతి తల్లి

కాకినాడలో కిడ్నాపైన ఏడేళ్ల బాలిక దీప్తిశ్రీ కేసు మిస్టరీగా మారింది. దీప్తిశ్రీని చంపి కాలువలో పడేసినట్లు శాంతికుమారి పోలీసులకు చెప్పినట్లు సమాచారం.

  • Published By: veegamteam ,Published On : November 24, 2019 / 03:20 AM IST
బాలికను కిడ్నాప్ చేసి హత్య చేసిన సవతి తల్లి

కాకినాడలో కిడ్నాపైన ఏడేళ్ల బాలిక దీప్తిశ్రీ కేసు మిస్టరీగా మారింది. దీప్తిశ్రీని చంపి కాలువలో పడేసినట్లు శాంతికుమారి పోలీసులకు చెప్పినట్లు సమాచారం.

కాకినాడలో కిడ్నాపైన ఏడేళ్ల బాలిక దీప్తిశ్రీ కేసు మిస్టరీగా మారింది. నేతాజీ నగర్‌లోని గవర్నమెంట్‌ స్కూల్లో చదువుకుంటున్న దీప్తిశ్రీ.. శుక్రవారం మధ్యాహ్నం కిడ్నాప్‌కు గురైంది. సాయంత్రం ఆమె ఇంటికి రాకపోవడంతో.. మేనత్త పోలీసులకు ఫిర్యాదు చేసింది. కిడ్నాప్ వ్యవహరంలో సవతి తల్లి శాంతికుమారి ప్రమేయం ఉందని అనుమానించిన పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 

దీప్తిశ్రీని చంపి కాలువలో పడేసినట్లు శాంతికుమారి పోలీసులకు చెప్పినట్లు సమాచారం. అయితే దీప్తిశ్రీ మృతదేహాన్ని ఎక్కడ దాచిందో మాత్రం చెప్పడం లేదు. గంటకో ప్రాంతం పేరు చెప్పడంతో మృతదేహాన్ని కనిపెట్టడం పోలీసులకు సవాల్‌గా మారింది. శాంతి కుమారి చెప్పినట్లు గజ ఈతగాళ్లను పెట్టి ఉప్పుటేరును గాలించారు. అయితే ఎక్కడా మృతదేహం దొరకలేదు. శాంతి కుమారిని మరోసారి గట్టిగా ప్రశ్నించే సరికి సామర్లకోట సమీపంలోని కాలువలో పడేసినట్లు చెప్పింది. మరోసారి బీచ్‌లో పడేసానని చెప్పింది. ఆమె నుంచి అసలు విషయం రాబట్టడానికి పోలీసులకు చుక్కలు కనిపిస్తున్నాయి.

మరోవైపు కిడ్నాప్‌ విషయంలో పోలీసుల దర్యాప్తు తీరు కూడా చర్చనీయాంశమైంది. ఈ కేసులో పోలీసుల నిర్లక్ష్యం కూడా ఉందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీప్తిని కిడ్నాప్‌ చేస్తుండగా చూసిన ప్రత్యక్ష సాక్షులు… మీడియాతో మాట్లాడొద్దంటూ పోలీసులు ఆంక్షలు విధించడం ఆ అనుమానాలకు మరింత బలాన్నిస్తోంది. దీప్తి కనిపించడం లేదంటూ శుక్రవారం సాయంత్రమే పోలీసులకు కంప్లైంట్‌ ఇచ్చినా… దర్యాప్తులో నిర్లక్ష్యం కారణంగానే పాపను హతమార్చి ఉంటారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.