Online Order Fraud : ఆన్లైన్లో కేక్ ఆర్డర్ చేస్తే.. బ్యాంకు అకౌంట్ నుంచి రూ.1.20 లక్షలు స్వాహా
ఓ వ్యక్తి ఆన్లైన్లో కేక్ ఆర్డర్ చేస్తే అతని బ్యాంకు ఖాతా నుంచి రూ.1.20 లక్షలు స్వాహా అయ్యాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
Online Order Fraud : మీరు ఏదైనా వస్తువును ఆన్లైన్లో ఆర్డర్ చేస్తున్నారా? అయితే జాగ్రత్త! ఓ వ్యక్తి ఆన్లైన్లో కేక్ ఆర్డర్ చేస్తే అతని బ్యాంకు ఖాతా నుంచి రూ.1.20 లక్షలు స్వాహా అయ్యాయి. బాధితులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్ నగరంలోని 27వ డివిజన్లో ఉన్న రాంకీ విల్లాస్లో నివాసముంటున్న తోట అఖిల్ తన స్నేహితుడి పుట్టిన రోజు సందర్భంగా శనివారం ఆన్లైన్లో కేక్ ఆర్డర్ చేశారు.
ఆర్డర్ ధ్రువీకరించుకోవడానికి ఫోన్ చేస్తున్నామని, మొబైల్ నంబర్కు వచ్చిన వన్టైం పాస్వర్డ్ చెప్పాలని అవతలి వ్యక్తి కోరడంతో అఖిల్ ఆ నంబర్ చెప్పాడు. ఆ వెంటనే అతని బ్యాంకు ఖాతా నుంచి రూ.60 వేలు వేరే ఖాతాకు వెళ్లినట్టు మెసేజ్ వచ్చింది. దీంతో అనిల్ అదే నంబర్కు ఫోన్ చేసి ఖాతాలో నగదు ఎక్కువ మొత్తంలో ట్రాన్స్ఫర్ అయినట్టు వారికి చెప్పారు.
Fraud Alert : ఆన్లైన్ యాప్ మోసం..రూ. 36 లక్షలు పొగొట్టుకున్న హైదరాబాద్ వాసి
తిరిగి ఓటీపీ వస్తుందని, అది చెప్తే డబ్బులు తిరిగి ఖాతాలో జమ అవుతాయని సదరు సంస్థ ప్రతినిధి సూచించడంతో మరోసారి ఓటీపీ వివరాలు చెప్పారు. వెంటనే అనిల్ ఖాతా నుంచి మరో రూ.60 వేలు బదిలీ అయ్యాయి. మొత్తం రూ.1.20 లక్షలు మోసపోయినట్టు గుర్తించిన బాధితుడు.. మిల్స్కాలనీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.