Jharkhand: స్కూల్ నుంచి ఇంటికెళ్తున్న బాలిక కిడ్నాప్, అత్యాచారం
పన్నేండేళ్ల బాలిక స్కూల్కు వెళ్లిన తర్వాత ఒక నోట్బుక్ మరిచిపోవడంతో, తీసుకొచ్చేందుకు మధ్యలో ఇంటికి బయల్దేరింది. బాలిక నడుచుకుంటూ వెళ్తుండగా కారులో వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఒక అడ్రస్ కావాలని అడిగారు. బాలిక సమాధానం చెప్పేలోపే, కారులో కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు.
Jharkhand: ఝార్ఖండ్లో దారుణం జరిగింది. పాఠశాల నుంచి ఇంటికెళ్తున్న ఆరో తరగతి బాలికను గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసి, ఆపై అత్యాచారానికి పాల్పడ్డారు. డమ్కా జిల్లా గోపికందర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన బుధవారం జరిగింది. పన్నేండేళ్ల బాలిక స్కూల్కు వెళ్లిన తర్వాత ఒక నోట్బుక్ మరిచిపోవడంతో, తీసుకొచ్చేందుకు మధ్యలో ఇంటికి బయల్దేరింది. బాలిక నడుచుకుంటూ వెళ్తుండగా కారులో వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఒక అడ్రస్ కావాలని అడిగారు. బాలిక సమాధానం చెప్పేలోపే, కారులో కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. తర్వాత అత్యాచారానికి పాల్పడ్డారు.
China provokes India: ఇండియాను రెచ్చగొట్టిన చైనా.. లదాఖ్ సరిహద్దులోకి చైనా విమానం
మరుసటి రోజు దగ్గర్లోని గొడ్డా పోలీస్ స్టేషన్ సమీపంలో వదిలిపెట్టారు. ఈ ఘటనపై బాలిక తల్లిదండ్రులకు వివరించింది. వారు డమ్కా జిల్లా పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రస్తుతం బాలికను ఫులో జానో ముర్ము మెడికల్ కాలేజ్కు వైద్య పరీక్షలు, చికిత్స నిమిత్తం తరలించారు. కాగా, నిందితులను ఇంకా గుర్తించలేదు. విచారణ జరిపి నిందితులను పట్టుకుంటామని పోలీసు అధికారులు చెప్పారు.