డ్రైవింగ్ చేస్తూ ప్రాణాలు వదిలిన లారీ డ్రైవర్

  • Published By: madhu ,Published On : March 2, 2019 / 07:48 AM IST
డ్రైవింగ్ చేస్తూ ప్రాణాలు వదిలిన లారీ డ్రైవర్

వాహనాలు నడుపుతూనే డ్రైవర్లు కుప్పకూలిపోతున్నారు. గుండెపోటుతో పలువురు డ్రైవర్లు మృతి చెందుతున్నారు. ఇటీవలే తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ బస్సు డ్రైవర్లు గుండెపోటు కారణంగా ప్రమాదాలు ఎదురైన సంగతి తెలిసిందే. తాజాగా కృష్ణా జిల్లా మచిలీపట్నంలో లారీ బీభత్సం సృష్టించింది. డ్రైవర్‌కి గుండెపోటు వచ్చి స్టీరింగ్‌పైనే కుప్పకూలిపోయాడు. ఈ ఘటనలో ఇద్దరికి గాయాలయ్యాయి. 
Read Also : 118 మూవీ రివ్యూ

బియ్యం లోడ్‌తో ఓ లారీ మార్చి 02వ తేదీ శనివారం వెళుతోంది. మచిలీపట్నం శివారు ప్రాంతం కాలేఖాన్ ప్రాంతానికి వచ్చేసరికి డ్రైవర్‌కి గుండెపోటు వచ్చింది. స్టీరింగ్ పైనే కుప్పకూలిపోయాడు. లారీ అదుపు తప్పి సమీపంలో ఉన్న హోటల్‌లోకి దూసుకెళ్లింది.
Read Also : రైతులు కావలెను : జీతం 20 వేలు

హోటల్ యజమానితో పాటు మరో ఇద్దరికి గాయాలయ్యాయి. రెండు బైక్‌లు ధ్వంసమయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా ప్రదేశానికి చేరుకున్నారు. గాయాలపాలైన వారికి ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు. 
Read Also : విషాదం : పరీక్ష హాల్లో ఇంటర్ విద్యార్ధి దుర్మరణం