Married Woman Eloped : బంగారం,డబ్బు తీసుకుని లడ్డూ లాంటి ప్రియుడితో పరారైన భార్య

అసోం లోని ధుబ్రి జిల్లాలో ఒక వివాహిత మహిళ తన ప్రియుడితో పారిపోయింది. తన భార్యను నలుగురు  వ్యక్తులు  కిడ్నాప్ చేశారని భర్త పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. వివరాలలోకి వెళితే.....

Married Woman Eloped : బంగారం,డబ్బు తీసుకుని లడ్డూ లాంటి ప్రియుడితో పరారైన భార్య

Married Woman Eloped

Married Woman Eloped :  అసోం లోని ధుబ్రి జిల్లాలో ఒక వివాహిత మహిళ తన ప్రియుడితో పారిపోయింది. తన భార్యను నలుగురు  వ్యక్తులు  కిడ్నాప్ చేశారని భర్త పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. వివరాలలోకి వెళితే…..

ధుబ్రి జిల్లాలోని అగోమోని పోలీసు  స్టేషన్ పరిధిలోని   పవర్ చర్ గ్రామానికి చెందిన మంతేశ్వర్ రాయ్ (38)కి మోనికా బాలరాయ్ (24) తో  కొన్నేళ్ల క్రితం వివాహం అయ్యింది.  వారికి రెండేళ్ల  కుమారుడు ఉన్నాడు. మోనికా ఇంటికి సమీపంలోని  సుజిత్  అలియాస్  లడ్డు అనే యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది.

కొన్నాళ్లుగా వారిద్దరి మధ్య సాగుతున్న వివాహేతర సంబంధానికి తెరదించాలనుకున్నారు ప్రేయసి ప్రియులు. గత సోమవారం సెప్టెంబర్ 27న మోనికా ఇంట్లోని రూ.35వేల నగదు, ఆభరణాలు తీసుకుని ప్రియుడు లడ్డూ  తో కలిసి కొడుకును తీసుకుని పారిపోయింది. భార్యకోసం  రెండురోజులు  చూసిన మంతేశ్వర్ రాయ్ అగోమని పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు.
Also Read : Wife Illegal Affair : ప్రియుడితో కలిసి బస్సులో వెళుతున్న భార్యను నరికేసిన భర్త
తన భార్యను నలుగురు వ్యక్తులు కిడ్నాప్ చేసారని ఇంట్లో ఉన్న రూ. 35 వేల నగదు, నగదు తీసుకుని పారిపోయారని తన ఫిర్యాదులో పేర్కోన్నాడు.  సుజిత్ అలియాస్ లడ్డూ, హేమంత రాయ్, వేద్ రాయ్, మంతోష్ రాయ్ అనేనలుగురు  వ్యక్తులకు  తన భార్యను కిడ్నాప్ చేయటంలో ప్రమేయం ఉందని ఫిర్యాదులో పేర్కోన్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మోనికా కోసం ఆమె బిడ్డ కోసం గాలిస్తున్నారు.