Wife Illegal Affair : ప్రియుడితో కలిసి బస్సులో వెళుతున్న భార్యను నరికేసిన భర్త

పెళ్లై చక్కగా కాపురం చేసుకుంటున్న కుటుంబంలో పక్కింటి వ్యక్తి చిచ్చు పెట్టాడు. వివాహిత మహిళతో సంబంధం పెట్టుకున్నాడు.

Wife Illegal Affair : ప్రియుడితో కలిసి బస్సులో వెళుతున్న భార్యను నరికేసిన భర్త

Husband Kills Wife

Wife Illegal Affair :  పెళ్లై చక్కగా కాపురం చేసుకుంటున్న కుటుంబంలో పక్కింటి వ్యక్తి చిచ్చు పెట్టాడు. వివాహిత మహిళతో సంబంధం పెట్టుకున్నాడు. అది తెలిసిన భర్త భార్యను హెచ్చరించాడు. అయినా ఆమె ప్రవర్తన మార్చుకోలేదు. భర్తకు తెలియకుండా   ప్రియుడితో ఎఫైర్ కొనసాగించసాగింది.  కోపం పట్టలేని భర్త భార్యను బహిరంగంగా బస్సులో  నరికేసిన ఘటన కర్ణాటక లోని బెళగావిలో చోటు చేసుకుంది.

బెళగావి జిల్లాలోని చిక్కోడి లో   ప్రవీణ్ కాంబ్లే (28)  భార్య వందనతో కలిసి కాపురం ఉంటున్నాడు.   సజావుగా  సాగుతున్న వారి కాపురంలోని పక్కింటిలో దిగిన యువకుడు చిచ్చుపెట్టాడు.  అందంగా ఉన్న వందనతో  మాట కలిపాడు. ఆమెతో పరిచయం పెంచుకున్నాడు.  భర్త ప్రవీణ్ ఆఫీసుకు వెళ్లగానే వందనా  పక్కింటి యువకుడితో  కబుర్లు చెప్పటం మొదలెట్టింది.

ఫోన్లలో పలకరింపుల స్ధాయి  నుంచి…. పర్సనల్ గా కలిసే స్దాయికి వారి మధ్య బంధం పెరిగింది.   క్రమంగా వారిద్దరి మధ్య  వివాహేతర సంబంధం బలపడింది. భర్త ఆఫీసుకు వెళ్లగానే  వందనా  తన ప్రియుడితో సన్నిహితంగా ఉండసాగింది.  కొన్నాళ్లకు ఈవిషయం ప్రవీణ్ కు తెలిసింది.  తప్పడు పనులు మానుకోమని భార్యను హెచ్చరించాడు.  అయినా ఆమె వినలేదు.  భర్త మాటను పెడచెవిన పెట్టింది.
Also Read :Extra Marital Affair : పక్కింటి అతడి భార్యతో వెళ్లిపోయిన కొడుకు… తల్లి ఆత్మహత్య

భర్తకు తెలియకుండా ప్రియుడ్ని కలుస్తూనే ఉంది. భార్యను ఏమీ చేయలేని ప్రవీణ్ భార్యపై  నిఘా పెట్టాడు.  అక్టోబర్ 1 శుక్రవారం ప్రవీణ్ ఉద్యోగానికి వెళ్లాడు. భర్త ఆఫీసుకు వెళ్లగానే   భార్య వందన   ప్రియుడితో   కలిసి బెళగావికి బయలు దేరింది.  ఈవిషయం తెలుసుకున్న   ప్రవీణ్   భార్య వెళుతున్న బస్సును బైక్ తో   వెంబడించాడు. బస్సు బెళగావి చేరుకుంది.  రోడ్డు మధ్యలో బస్సుకు ఎదురగా బైక్ ను ఆపాడు. ఆవేశంతో బస్సు ఎక్కాడు.

ప్రియుడి పక్కన   కూర్చున్న భార్యను చూసి  కోపంతో రగిలిపోయాడు. తనతో తెచ్చుకున్న  మారణాయుధంతో  భార్యపై విచక్షణా రహితంగా దాడి చేసి గాయపరిచాడు.  ఆమెను రక్షించాటానికి  ముందుకు వచ్చిన ప్రయాణికులను మారణాయుధం తో బెదిరించాడు.  భార్యపై దాడి  చేసిన అనంతరం బస్సు దిగిన ప్రవీణ్ ను కొందరు వ్యక్తులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు.  తీవ్రంగా  గాయపడిన   వందనను ఆస్పత్రికి తరలించారు.  అక్కడ ఆమె పరిస్ధితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.