Noida woman: బయటపడ్డ పాయల్ నాటకం.. మరో మహిళను చంపి.. ఆమె మృతదేహంతో తను ఆత్మహత్య చేసుకున్నట్లు నమ్మించిన యువతి

నోయిడాకు చెందిన ఒక యువతి తన బంధువులను అక్రమ కేసులో ఇరికించేందుకు కనీవినీ ఎరుగని దారుణానికి తెగబడింది. తనలాగే ఉండే ఒక మహిళను చంపి, తనే ఆత్మహత్య చేసుకున్నట్లు నమ్మించింది.

Noida woman: బయటపడ్డ పాయల్ నాటకం.. మరో మహిళను చంపి.. ఆమె మృతదేహంతో తను ఆత్మహత్య చేసుకున్నట్లు నమ్మించిన యువతి

Noida woman: ఢిల్లీ, నోయిడా పరిధిలో ఒక యువతి చేసిన దారుణం బయటపడింది. తనలాగే ఉండే మరో మహిళను చంపిన యువతి, ఆమె మృతదేహాన్ని తనదిగా నమ్మించింది. అయితే, చివరకు ఈ నాటకం బయటపడి కటకటాలపాలైంది. నోయిడాకు చెందిన పాయల్ భాటి యువతి, తన బంధువులను ఎలాగైనా అక్రమ కేసులో ఇరికించి జైలుపాలు చెయ్యాలనుకుంది.

Maharashtra: బాలికపై పదిహేనేళ్ల బాలుడి హత్యాచారం.. బాలిక తండ్రిపై ప్రతీకారం తీర్చుకునేందుకు దారుణం

దీనికోసం ఒక ప్లాన్ రెడీ చేసింది. తనలాగే ఉండే, షాపింగ్ మాల్‌లో పనిచేసే ఒక యువతిని ఎంపిక చేసుకుంది. తర్వాత ఆమెతో పరిచయం పెంచుకుని, ఒకరోజు తన ఇంటికి తీసుకెళ్లి హత్య చేసింది. ముఖాన్ని కాల్చేసింది. మృతదేహాన్ని గుర్తుపట్టకుండా చేసింది. తర్వాత ఆమె మృతదేహానికి తన బట్టలు తొడిగింది. ఒక సూసైడ్ నోట్ కూడా రాసింది. తన ఆత్మహత్యకు బంధువులే కారణమని లేఖలో పేర్కొంది. తన ముఖం కాలిపోవడం వల్ల ఆత్మహత్య చేసుకుంటున్నట్లు లేఖలో రాసింది. ఈ తతంగం మొత్తానికి పాయల్ భాటి ప్రియుడు అజయ్ ఠాకూర్ సహకరించాడు. ఇద్దరూ కలిసి ఈ పని పూర్తి చేశారు. తర్వాత వేరే ప్రదేశంలో మృతదేహాన్ని పడేశారు. తర్వాత స్థానికులు ఇచ్చిన సమాచారంతో మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు అది పాయల్ భాటిదిగా భావించారు.

IPL Auction: డిసెంబర్ 23న ఐపీఎల్ మినీ వేలం.. పోటీలో 991 మంది ఆటగాళ్లు.. ఆస్ట్రేలియా ప్లేయర్సే టాప్

ముఖం గుర్తు పట్టలేకుండా ఉండటం, డ్రెస్సు ఆమెదే కావడం, శరీర పోలికలు దగ్గరగా ఉండటం, సూసైడ్ నోట్ దొరకడం వంటి కారణాలతో పోలీసులు కూడా పెద్దగా అనుమానించలేదు. ఆ మృతదేహాన్ని పాయల్ భాటి బంధువులకు అప్పగించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న బంధువులు అంత్యక్రియలు కూడా నిర్వహించారు. అయితే, ఇదే సమయంలో మరణించిన యువతి కుటుంబ సభ్యులు ఆమె కనిపించడం లేదని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. రెండు కేసులకు ఏదో సంబంధం ఉందని అనుమానించిన పోలీసులు అన్ని కోణాల్లో విచారణ జరపగా అసలు విషయం బయటపడింది. పాయల్ భాటి, ఆమె ప్రియుడు చేసిన ఘోరం బయటపడింది. పాయల్ ఇలా చేసేందుకు ప్రతీకారమే కారణమని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. కొద్దిరోజుల క్రితం పాయల్ భాటి తల్లిదండ్రులు ఆత్మహత్య చేసుకున్నారు.

Nara Brahmani: లదాఖ్‌లో నారా బ్రాహ్మణి బైక్ యాత్ర.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

పాయల్ తల్లిదండ్రులు తమ బంధువులకు కొంత డబ్బు అప్పుగా ఇచ్చారు. తర్వాత వాళ్లు తమ డబ్బు తిరిగి ఇవ్వమని బంధువులను అడిగారు. కానీ, ఆ డబ్బు తిరిగి ఇవ్వకపోగా, పాయల్ తల్లిదండ్రులనే తిరిగి వేధించారు. దీంతో పాయల్ తల్లిదండ్రులు ఆత్మహత్య చేసుకున్నారు. తన తల్లిదండ్రుల మరణానికి కారణమైన బంధువులపై ప్రతీకారం తీర్చుకోవాలనుకున్న పాయల్ ఈ ఆత్మహత్య నాటకానికి తెరతీసింది. తన ఆత్మహత్యకు బంధువులే కారణమని నమ్మించడం ద్వారా వారిని జైలుపాలు చేయాలనుకుంది. చివరకు తనే జైలుపాలైంది. ప్రస్తుతం పోలీసులు పాయిల్ భాటి, ఆమె ప్రియుడు అజయ్ ఠాకూర్‌ను అరెస్టు చేసి విచారిస్తున్నారు.