రోజుకు 87 అత్యాచారాలు..మహిళలపై హింస పెరుగుతోంది

  • Published By: nagamani ,Published On : September 30, 2020 / 03:50 PM IST
రోజుకు 87 అత్యాచారాలు..మహిళలపై హింస పెరుగుతోంది

rape cases: భారతావనిలో మహిళలపై అత్యాచారాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో వెల్లడించిన ఈ గణాంకాలు అంశం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. 2018తో పోలిస్తే, 2019లో దేశ వ్యాప్తంగా మహిళలపై అత్యాచారాలు పెరిగాయలని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో వెల్లడించింది. 2019లో దేశంలో 87 వేల అత్యాచార కేసులు నమోదయ్యాయనీ..2020లో మహిళలపై పాల్పడిన నేరాలకు సంబంధించి 4.05 లక్షలకు పైగా కేసులు రిజిస్టర్ అయ్యాయని వెల్లడించింది. గతం కంటే అత్యాచారాలు 7.3శాతం పెరిగాయని తెలిపింది. అంటే ఏడాది ఏడాదికి అత్యాచారాలు పెరుగుతున్నాయని తేటతెల్లమవుతోంది.


‘క్రైమ్స్ ఇన్ ఇండియా – 2019’ పేరిట ఈ నివేదిక విడుదల కాగా, మహిళలపై నేరాలు 7.3 శాతం పెరిగాయని, ప్రతి లక్ష మంది మహిళల్లో 62.4 మంది అత్యాచారాలు, వేధింపులను ఎదుర్కొన్న వారేనని తెలిపింది. 2018లో మహిళలపై వివిధ రకాల నేరాలకు పాల్పడిన కేసులు 3,78,236గా ఉండగా, 2019లో వాటి సంఖ్య 4,05,861కి పెరిగాయని పేర్కొంది.


2018లో 58.8 శాతంగా ఉంటే 2019నాటికి అది 62.4 శాతానికి పెరిగింది. మహిళలపై మహిళలపై నేరాలు నేరాల సంఖ్య పెరిగింది. అత్యాచారాల కేసుల సంఖ్య 32,559 నుంచి 33,356కు పెరిగాయని తాజా రిపోర్టు పేర్కొంది. ఇక వీటిలో అత్యధిక కేసుల్లో మహిళలు భర్త లేదా బంధువుల నుంచి వేధింపులు ఎదుర్కొన్నవేనని కూడా వెల్లడించింది. ఈ తరహా కేసులు 30.9 శాతం ఉండగా, మహిళలపై దాడులు, అత్యాచారాల కేసులు 21.8 శాతం ఉండగా, కిడ్నాప్ కేసులు 17.9 శాతం ఉన్నాయని ఎన్సీఆర్బీ పేర్కొంది.


మహిళలతో పాటు చిన్నారులపైనా వేధింపులు, దాడులకు పాల్పడిన కేసుల సంఖ్య గత సంవత్సరం పెరిగింది. 2018తో పోలిస్తే చిన్నారులపై నేరాల సంఖ్య 4.5 శాతం పెరిగి మొత్తం 1.48 లక్షలకు పైగా కేసులు రిజిస్టర్ అయ్యాయి. వీటిల్లో 46.6 శాతం కిడ్నాప్ కేసులు కావడం గమనార్హం. కాగా, ఈ నివేదికలో పశ్చిమ బెంగాల్ లో 2019లో జరిగిన నేరాలను మాత్రం చేర్చలేదు.



ఆ వివరాలను రాష్ట్ర ప్రభుత్వం అందించలేదని ఎన్సీఆర్బీ తెలియజేసింది. 2018లో దేశ వ్యాప్తంగా మహఇళలపై 3లక్షల 78 వేల 236 నేరాలు నమోదుకాగా వీటిలో 33,356 అత్యాచారాల కేసులే ఉన్నాయని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో వెల్లడించింది.