ESI మెడికల్ స్కామ్ విచారణలో సంచలన విషయాలు

ఈఎస్ఐ మెడికల్ స్కామ్ విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మెడికల్ కిట్ల పేరుతో కోట్ల రూపాయల నిధులు గోల్ మాల్ జరిగినట్లు ఏసీబీ తేల్చింది.

  • Published By: veegamteam ,Published On : October 29, 2019 / 12:36 PM IST
ESI మెడికల్ స్కామ్ విచారణలో సంచలన విషయాలు

ఈఎస్ఐ మెడికల్ స్కామ్ విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మెడికల్ కిట్ల పేరుతో కోట్ల రూపాయల నిధులు గోల్ మాల్ జరిగినట్లు ఏసీబీ తేల్చింది.

ఈఎస్ఐ మెడికల్ స్కామ్ విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మెడికల్ కిట్ల పేరుతో కోట్ల రూపాయల నిధులు గోల్ మాల్ జరిగినట్లు ఏసీబీ తేల్చింది. ఐఎంఎస్ డైరెక్టర్ దేవికారాణి సూత్రధారిగా, ఇతర సిబ్బంది పాత్రదారులుగా అక్రమాలకు పాల్పడినట్లుగా ఏసీబీ గుర్తించింది.

2017, 2018లో మెడికల్ కిట్ల కోసం రూ.60 కోట్ల బడ్జెట్ కేటాయించారు. వీటిలో మొత్తం 22 ఇండెంట్లు ఉండగా విచారణలో భాగంగా ఏసీబీ అధికారులు రెండు ఇండెంట్లను పరిశీలించారు. ఇందులో హెచ్ ఐవీ కిట్ల పేరుతో కోటి 76 లక్షల రూపాయలు మింగేసినట్లు గుర్తించారు. ఈ వ్యవహారంలో డైరెక్టర్, జేడీ కార్యాలయం సిబ్బంది పాత్రపై ఏసీబీ దర్యాప్తు ప్రారంభించింది.  

ఈకేసులో డైరెక్టర్ దేవికారాణితోపాటు జాయింట్ డైరెక్టర్ పద్మ కొంతమంది మెడికల్ ఆఫీసర్లు దాదాపు 16 మందిని ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ప్రధానంగా దర్యాప్తులో కొన్ని కీలక విషయాలు అధికారుల దృష్టికి వచ్చాయి. మెడికల్ కిట్లను కొనుగోలు చేయకుండానే కొనుగోలు చేసినట్లుగా డాక్యుమెంట్లు సృష్టించి పెద్ద ఎత్తున నిధుల గోల్ మాల్ కు పాల్పడినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు.