Delhi Murder: శ్రద్ధా తరహాలో మరో హత్య.. భర్త శవాన్ని పది ముక్కలుగా నరికి ఫ్రిజ్‌లో దాచిన భార్య

శ్రద్ధ హత్య ఘటన మరువక ముందే ఢిల్లీలో అలాంటి మరో ఘటన వెలుగుచూసింది. ఢిల్లీలో ఒక మహిళ తన భర్తను చంపి, శరీరాన్ని పది ముక్కలుగా నరికింది. శరీర భాగాల్ని ఫ్రిజ్‌లో దాచి ఉంచింది. దీనికి ఆమె కొడుకు కూడా సహకరించాడు.

Delhi Murder: శ్రద్ధా తరహాలో మరో హత్య.. భర్త శవాన్ని పది ముక్కలుగా నరికి ఫ్రిజ్‌లో దాచిన భార్య

Delhi Murder: ఢిల్లీలో శ్రద్ధ హత్య ఘటన మరువక ముందే అలాంటి మరో హత్య అక్కడే వెలుగు చూసింది. ఒక మహిళ తన భర్తను చంపి, శవాన్ని పది ముక్కలుగా చేసి ఫ్రిజ్‌లో దాచేసింది. ఈ ఘటనలో ఆమె కొడుకు కూడా సహకరించాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తర ఢిల్లీ పాండవ్ నగర్ ప్రాంతంలోని ఒక ఇంట్లో అంజన్ దాస్, తన భార్య పూనమ్, కొడుకు దీపక్‌తో కలిసి ఉంటున్నాడు.

Andhra Pradesh: అమరావతి కేసు.. హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ

అయితే, అంజన్‌కు అంతకుముందే వేరే మహిళతో వివాహం జరిగింది. అతడికి ఎనిమిది మంది పిల్లలు కూడా ఉన్నారు. పూనమ్‌కు కూడా అంతకుముందే వివాహం జరిగింది. అయితే, ఆమె భర్త 2016లో మరణించాడు. దీంతో 2017లో పూనమ్, అంజన్ దాస్ పెళ్లి చేసుకున్నారు. అప్పటికే పూనమ్‌కు దీపక్ అనే కొడుకు కూడా ఉన్నాడు. వీళ్లంతా పాండవ్ నగర్‌లో ఉండేవాళ్లు. అయితే, అంజన్ దాస్ పని చేయకుండా ఇంట్లో ఎప్పుడూ గొడవలు పెట్టుకునే వాడు. ఈ క్రమంలో అతడిని చంపాలని పూనమ్, ఆమె కొడుకు దీపక్ నిర్ణయించుకున్నారు. దీంతో అతడికి మద్యంలో నిద్ర మాత్రలు కలిపి ఇచ్చారు. అది తాగి మత్తులో నిద్రపోయిన తర్వాత ఇద్దరూ కలిసి అతడి గొంతు కోసి చంపేశారు. తర్వాత అతడి శరీరాన్ని పది ముక్కలుగా నరికి ఫ్రిజ్‌లో దాచి ఉంచారు.

Trivikram: బాక్సాఫీస్‌ను షేక్ చేసేందుకు మరోసారి ఆ కాంబినేషన్ వస్తుందా..?

తర్వాత వీలునుబట్టి దగ్గర్లో శరీర భాగాల్ని పడేసి వచ్చేవాడు దీపక్. ఇంట్లో ఎలాంటి వాసన రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. రక్తపు మరకలు కనిపించకుండా గోడలకు పెయింట్ చేశారు. తర్వాత అతడి మృతదేహానికి సంబంధించిన శరీర భాగాలు సమీపంలో దొరికాయి. వీటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాగా, ఈ హత్యపై విచారణ జరిపిన పోలీసులు పూనమ్, ఆమె కొడుకు దీపక్‌ను అరెస్టు చేశారు. పూర్తి శరీర భాగాలు ఇంకా దొరకాల్సి ఉంది. వివాహేతర సంబంధం కూడా ఈ హత్యకు మరో కారణంగా పోలీసులు భావిస్తున్నారు.