Bahadurpura : నా ఫోన్ అమ్మి అంత్యక్రియలు చేయండి..బాలుడు ఆత్మహత్య

అమ్మా..నాన్న..నన్ను క్షమించండి...నేను మిమ్మల్ని వదిలివెళుతున్నా...ఇక నన్ను మరచిపోండి...నా ఫోన్ అమ్మి..అంత్యక్రియలు నిర్వహించండి..అంటూ ఓ బాలుడు లెటర్ రాసి..ఆత్మహత్య చేసుకున్నాడు.

Bahadurpura : నా ఫోన్ అమ్మి అంత్యక్రియలు చేయండి..బాలుడు ఆత్మహత్య

Suside

Suicide : క్షణికావేశం ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది..! ఏ కష్టమొచ్చిందో తెలియదు.. గుండె పోటు మాత్రం వచ్చిందనుకున్నాడు.. అది నిజమో కాదో అతనికే తెలియదు.. తల్లిదండ్రులను బాధ పెట్టడం ఇష్టం లేదనుకున్నాడు.. వాళ్లకి భారం అవకూడదనుకున్నాడు. వాళ్లని కష్ట పెట్టకూడదనుకున్నాడు..! తన సమస్యను చెప్పలేదు..! బాధను దిగమింగాడు..! వారం పాటు నవ్వుతూ నవ్వించాడు..! అన్నతో కలిసి ఆడుకున్నాడు..! అక్కని ఆట పట్టించాడు..! ఇకా ఈ జీవితం చాలనుకున్నాడు.. మరోసారి గుండెపోటు వస్తుందని ఫిక్స్‌ అయ్యాడు.. అంతే ఇంట్లో ఎవరు లేని సమయంలో ఆత్మహత్య చేసుకున్నాడు.. ఆ కుటుంబానికి తీరని శోకాన్ని మిగిల్చాడు.. ఇది హైదరాబాద్ పాతబస్తీకి చెందిన పదో విద్యార్థి వవన్‌ కథ.. కుటుంబాన్ని దు:ఖ సంద్రంలో ముంచేసిన పవన్‌ వ్యథ..

Read More : Yadadri Temple : యాదాద్రిలో క్షేత్రపాలకుడికి ఆకుపూజ

పదో తరగతి పూర్తి చేసిన పవన్ కు వారం రోజుల క్రితం గుండెపోటు వచ్చింది. ఈ విషయం ఇంట్లో చెబితే..తల్లిదండ్రులు భయపడిపోతారని ఆందోళన చెందాడు. దీంతో ఆత్మహత్య శరణ్యమని భావించాడు. చనిపోవాలని నిర్ణయం తీసుకుని..ఓ లెటర్ రాశాడు. అమ్మా..నాన్న నన్ను క్షమించాలని, నేను మిమ్మల్ని వదిలివెళుతున్నానని అందులో రాశాడు. నన్ను మరిచిపోవాలని, నా ఫోన్ అమ్మి అంత్యక్రియలు నిర్వహించాలని సూచించాడు. అప్పుడే తన ఆత్మకు శాంతి కలుగుతుందని సూసైడ్ నోట్ లో పేర్కొన్నాడు. అనంతరం ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా ప్రదేశానికి చేరుకుని….కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు. అతను రాసిన లెటర్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.