Tamil Nadu: భర్తపై అనుమానంతో.. మర్మాంగాలపై వేడి నీళ్లు పోసిన భార్య

భర్త మరో మహిళతో సన్నిహితంగా ఉంటున్నట్లు అనుమానించింది అతడి భార్య. దీనిపై భర్తతో గొడవ పడింది. తర్వాత అతడి మర్మాంగాలపై వేడి నీళ్లు పోసింది. తీవ్రంగా గాయపడ్డ భర్త ప్రస్తుతం కాలిన గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

Tamil Nadu: భర్తపై అనుమానంతో.. మర్మాంగాలపై వేడి నీళ్లు పోసిన భార్య

Tamil Nadu: భర్త మరో మహిళతో సన్నిహితంగా ఉంటున్నాడని అనుమానించిన భార్య.. అతడి మర్మాంగాలపై వేడి నీళ్లు పోసింది. దీంతో తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన తమిళనాడులో మంగళవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పూడుపట్టుకు చెందిన తంగరాజ్ (32) స్థానికంగా ఒక మొబైల్ తయారీ కంపెనీలో పని చేస్తున్నాడు.

Saudi Woman: ట్విట్టర్ వాడినందుకు సౌదీలో మహిళకు 34 ఏళ్ల జైలు శిక్ష

అతడికి ప్రియా (29) అనే మహిళతో ఏడేళ్లక్రితం పెళ్లైంది. ఈ జంటకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే, తంగరాజ్ పని చేసే చోట మరో మహిళతో సన్నిహితంగా ఉంటున్నట్లు అతడి భార్య ప్రియ అనుమానించసాగింది. ఈ విషయంలో ఇరువురి మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. గత మంగళవారం రాత్రి కూడా ఇద్దరి మధ్యా వాగ్వాదం జరిగింది. తర్వాత తంగరాజ్ పడుకున్నాడు. అయితే, ఈ విషయంలో కోపం తెచ్చుకున్న ప్రియ వేడి నీళ్లు మరిగించింది. నిద్రపోతున్న భర్త మర్మాంగాలపై వేడి నీళ్లు పోసింది. ఈ ఘటనలో అతడి మర్మాంగాలతోపాటు ఒంటిపై కూడా కాలిన గాయాలయ్యాయి. అతడు బాధతో అరుస్తుంటే, చుట్టుపక్కల వాళ్లు వచ్చి స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

Madhya Pradesh: వివాహేతర సంబంధంపై గొడవ.. రైలు కింద ముగ్గురు కూతుళ్లను తోసేసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి

ప్రస్తుతం తంగరాజ్ 50 శాతం కాలిన గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతడి పరిస్థితి విషమంగానే ఉంది. కావేరిపాక్కం పోలీసులు తంగరాజ్ భార్య ప్రియపై సెక్షన్ 294, 324, 506 కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.