Father kills son: దుబాయ్ నుంచి వచ్చిన కొడుకును చంపిన తండ్రి.. కారణమేంటంటే

దుబాయ్ నుంచి వారం క్రితమే వచ్చిన కొడుకును తండ్రి గొడ్డలితో నరికి చంపాడు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా, భీంగల్ మండలంలో జరిగింది. కొడుకు దుబాయ్ నుంచి పంపించిన డబ్బు గురించి తండ్రిని ప్రశ్నించినందుకే ఈ దాడికి పాల్పడ్డాడు.

Father kills son: దుబాయ్ నుంచి వచ్చిన కొడుకును చంపిన తండ్రి.. కారణమేంటంటే

Father kills son: నిజామాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. వారం రోజుల క్రితం దుబాయ్ నుంచి వచ్చిన కొడుకును తండ్రి గొడ్డలితో నరికి చంపాడు. ఈ ఘటన శుక్రవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిజామాబాద్ జిల్లా, భీంగల్ మండలం, మెండోరా గ్రామానికి చెందిన డి.సుమన్ (30) అనే వ్యక్తి దుబాయ్‌లో కూలీగా పని చేస్తున్నాడు.

Viral Video: సఫారి జీప్‌ను వెంటాడిన ఏనుగు.. తప్పించుకున్న టూరిస్టులు.. వీడియో వైరల్

దుబాయ్‌లో పని చేసేటప్పుడు ఇక్కడే ఉన్న తండ్రి రమేష్‌కు డబ్బు పంపించేవాడు. కాగా, గతవారమే సుమన్.. దుబాయ్ నుంచి స్వగ్రామానికి తిరిగి వచ్చాడు. వచ్చిన తర్వాత తాను దుబాయ్ నుంచి పంపించిన డబ్బు గురించి తండ్రిని అడిగాడు. ఆ డబ్బంతా ఏం చేశావని తండ్రిని ఆరాతీశాడు. అయితే, కొడుకు పంపించిన డబ్బుకు సంబంధించి సరైన వివరాలు చూపడంలో తండ్రి రమేష్ విఫలమయ్యాడు. దీంతో ఇద్దరి మధ్యా గొడవ జరిగింది. కొద్ది రోజులుగా డబ్బు విషయమై తండ్రీ కొడుకుల మధ్య వివాదం నడుస్తోంది. ఇటీవల ఈ అంశంపై స్థానిక పెద్దలు ఇద్దరి మధ్యా సయోధ్య కుదిర్చేందుకు ప్రయత్నించారు. కాగా, గత గురువారం గణేష్ నిమజ్జనం తర్వాత అర్ధరాత్రి ఇంటికి వచ్చాడు సుమన్.

Karnataka Govt: ఏసీబీని రద్దు చేసిన కర్ణాటక ప్రభుత్వం.. ఇకపై అవినీతి కేసులన్నీ లోకాయుక్తకే

రాత్రి రెండు గంటల సమయంలో కూడా డబ్బు విషయంలో తండ్రీ కొడుకుల మధ్య గొడవ తలెత్తింది. ఈ క్రమంలో ఆగ్రహానికి గురైన రమేష్.. కొడుకుపై గొడ్డలితో దాడి చేశాడు. ఈ ఘటనలో సుమన్ అక్కడికక్కడే మరణించాడు. తర్వాత పక్క ఇండ్లలోనే ఉన్న బంధువులు, ఇతర కుటుంబ సభ్యులకు విషయం చెప్పాడు. వారు ఘటనా స్థలానికి చేరుకుని పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు నిందితుడు రమేష్‌ను అరెస్టు చేశారు. సుమన్ మృతదేహాన్ని పోస్టుమార్టమ్ నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు తదుపరి విచారణ కొనసాగుతోంది.