Three Missing : ఫోన్‌లో భార్య ఎక్కువగా మాట్లాడిందని మందలిస్తే..!

మల్కాజ్‌‌గిరి పోలీసు స్టేషన్ పరిధిలో.... ఫోన్ ఎక్కువగా మాట్లాడుతోందని మందలించిన ఒక మహిళతో సహా ముగ్గురు అదృశ్యమయ్యారు.

Three Missing : ఫోన్‌లో భార్య ఎక్కువగా మాట్లాడిందని మందలిస్తే..!

Missing Woman In Malkajgiri

Three Missing : మల్కాజ్‌‌గిరి పోలీసు స్టేషన్ పరిధిలో…. ఫోన్ ఎక్కువగా మాట్లాడుతోందని మందలించిన ఒక మహిళతో సహా ముగ్గురు అదృశ్యమయ్యారు. మీర్జాలగూడకు చెందిన లింగాల మౌనిక(30) అనే మహిళ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. ఆమె భర్త భూమయ్య కూరగాయల వ్యాపారం నిర్వహిస్తున్నాడు.

మౌనిక ఎక్కువ సమయం సెల్ ఫోన్ లో మట్లాడటం గమనించిన భూమయ్య భార్యను మందలించాడు.అంతంతసేపు సెల్ ఫోన్ లో మాట్లాడమెందుకని. ఈ నేపధ్యంలో అక్టోబర్ 1వ తేదీన ఉద్యోగానికి వెళ్ళిన మౌనిక సాయంత్రం ఇంటికి తిరిగిరాలేదు. ఆఫీసులో సంప్రదించగా ఆరోజు విధులకు రాలేదని చెప్పారు. ఆమె సెల్‌ఫోన్‌కు  ఫోన్ చేయగా స్విఛ్ఛాప్ వచ్చింది. దీంతో భర్త, తన భార్య కనపడటంలేదని మల్కాజ్ గిరి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
Also Read : Father Sexual Abuse : కూతురుకి మద్యం తాగించి అత్యాచారం చేసిన తండ్రి
ఉత్తమ్ నగర్ కు చెందిన దత్తోపంత్ విఠల్ రావు వాసుదేవన్ (66) అనే వ్యక్తి సెప్టెంబర్ 22 నుంచి కనిపించటంలేదని అతని కుమారుడు వైభవ్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గతంలోనూ ఇలాగే వెళ్లి తిరిగివచ్చేసేవాడని.. ఈసారి ఇంకా రాలేదని ఫిర్యాదులో పేర్కోన్నాడు.

వీణాపాణి నగర్ కు చెందిన కార్పెంటర్ ద్రోణాచారి(52) గతనెల 29న మరో కార్పెంటర్ రవీంద్రాచారితో కలిసి పని కోసం బొల్లారం వెళ్లాడు.3 రోజులైనా తిరిగి ఇంటికి రాకపోవటంతో అతని భార్య సుధారాణి పోలీసులకు ఫిర్యాదు చేసింది.