ఏపీ పాలిసెట్- 2019 ఫలితాలు విడుదల

  • Published By: veegamteam ,Published On : May 9, 2019 / 07:09 AM IST
ఏపీ పాలిసెట్- 2019 ఫలితాలు విడుదల

ఆంధ్రప్రదేశ్‌ పాలిసెట్‌-2019 ఫలితాలను ఈ రోజు విజయవాడలో విడుదల చేశారు. పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశాలకు ఏప్రిల్ 30న‌ నిర్వహించిన ప్రవేశ పరీక్షకు మొత్తం 1,31,931 దరఖాస్తు చేసుకోగా. 1,24,899 మంది విద్యార్థులు హాజరయ్యారు. 

ఈ రోజు విడుదలైన ఫలితాల్లో 82 శాతం అబ్బయిలు, 87 శాతం బాలికలు ఉత్తీర్ణత సాధించారు. విద్యార్థులు విద్యాసంవత్సరం నష్టపోకుండా.. పరీక్షలో ఉత్తీర్ణులు కాని విద్యార్థులకు ఇంటర్ పరీక్షల తరహాలో సప్లిమెంటరీ పరీక్ష నిర్వహించనున్నారు. 

పాలిసెట్ ఫలితాల కోసం క్లిక్ చేయండి..

అదనంగా 8 మార్కులు:

పాలిసెట్ ప్రవేశ పరీక్షలో 7 ప్రశ్నలకు జవాబులు లేకుండా ప్రశ్నలు ఇచ్చారు, మరో ప్రశ్నను తెలుగు, ఇంగ్లిష్ మాధ్యమాల్లో విభిన్నంగా ఇచ్చారు. దీంతో పరీక్ష రాసిన విద్యార్థులందరికీ అదనంగా 8 మార్కులు కలపాలని సాంకేతిక విద్యాశాఖ నిర్ణయించింది. ఈ మార్కులను కలిపే ఫలితాలను విడుదల చేయనున్నారు.