Admission : అగ్రి బిజినెస్ లో పీజీ డిప్లొమా ప్రవేశ నోటిఫికేషన్
హ్యుమానిటీస్, సోషల్ సైన్సెస్, ఇంజనీరింగ్, ప్యూర్ సైన్సెస్, కామర్స్ తదితర విభాగాల్లో డిగ్రీ పూర్తిచేసినవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు
Admission : హైద్రాబాద్ రాజేంద్రనగర్ లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చరల్ ఎక్స్టెన్షన్ మేనేజ్మెంట్ రెండేళ్ల ఫుల్టైం పోస్ట్ గ్రాడ్యుయేట్ అగ్రి – బిజినెస్ మేనేజ్మెంట్ డిప్లొమా ప్రోగ్రామ్లో ప్రవేశానికి నోటిఫికేషన్ జారీ చేసింది. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి అగ్రికల్చరల్ సైన్సెస్, అగ్రికల్చర్, అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్, కమర్షియల్ అగ్రికల్చర్, అగ్రికల్చరల్ మార్కెటింగ్ , అగ్రికల్చరల్ ఇంజనీరింగ్, అగ్రికల్చరల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, బయో ఇన్ఫర్మాటిక్స్, బయోటెక్నాలజీ, డెయిరీ టెక్నాలజీ, ఫిషరీస్, ఫుడ్ టెక్నాలజీ, ఫుడ్ ప్రాసెసింగ్ ఇంజనీరింగ్, ఫారెస్ట్రీ, హర్టికల్చర్, సెరికల్చర్, వెటర్నరీ సైన్స్ అండ్ యానిమల్ హస్బెండరీ విభాగాల్లో డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్ధులు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు.
హ్యుమానిటీస్, సోషల్ సైన్సెస్, ఇంజనీరింగ్, ప్యూర్ సైన్సెస్, కామర్స్ తదితర విభాగాల్లో డిగ్రీ పూర్తిచేసినవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే కనీసం 50 శాతం మార్కులు వచ్చి ఉండాలి. క్యాట్ 2021లో అర్హత పొంది ఉండాలి. పర్సనల్ ఇంటర్వ్యూ, అగ్రికల్చర్ అండ్ మేనేజ్మెంట్ అంశంపై ఎస్సే రైటింగ్, గ్రూప్ డిస్కషన్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తులను ఆన్లైన్లో పంపాల్సి ఉంటుంది. దరఖాస్తులు పంపేందుకు చివరి తేదీ డిసెంబరు 31,పూర్తి వివరాలకు వెబ్ సైట్ manage.gov.in