TS EAMCET : ఆరు నుంచి ఎంసెట్ రెండో విడత
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా నవంబర్ 6 నుంచి ఎసెంట్ రెండో విడత కౌన్సెలింగ్ జరుగనుంది. నవంబర్ 6 నుంచి ఎసెంట్ రెండో విడత కౌన్సెలింగ్ జరుగనుంది.
TS EAMCET 2nd phase counselling : తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా నవంబర్ 6 నుంచి ఎసెంట్ రెండో విడత కౌన్సెలింగ్ జరుగనుంది. రాష్ట్రంలో ఇప్పటికే దాదాపు 90వేల ఇంజనీరింగ్ సీట్లు ఉన్నాయి. తొలి దశ కౌన్సెలింగ్లో 78,270 సీట్లను భర్తీ చేయగా.. 61,169 మంది సెల్ఫ్ రిపోర్టింగ్ చేశారు. దాంతో 46,322 సీట్లు మిగిలిపోయాయి.
గత నెలలో జేఈఈ అడ్వాన్స్డ్ ర్యాంకులను ప్రకటించిన సంగతి తెలిసిందే. రాష్ట్ర ఇంజనీరింగ్ కాలేజీల్లో ఐఐటీ, ఎన్ఐటీ, ట్రిపుల్ ఐటీ కాలేజీల్లో సీట్లను విద్యార్థులు పొందవచ్చు. తద్వారా మరికొన్ని సీట్లు ఖాళీ అవుతాయి. మొదటి దశ కౌన్సెలింగ్లో పొందిన సీటును క్యాన్సిల్ చేసేందుకు ఈ నెల 5వ తేదీ చివరి గడువు ఉంది. ఇక మిగిలిన సీట్లపై నవంబర్ 6వ తేదీన స్పష్టత రానుంది. కన్వీనర్ కోటా కింద భర్తీ అయ్యే సీట్లకు ఫీజు రీయింబర్స్మెంట్ పేమెంట్కు రూ.73,50,92,604 మంజూరు చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది.
JNTUH అనుబంధ గుర్తింపు ప్రక్రియలో భాగంగా డిమాండ్ లేని కోర్సుల్లో కొన్ని సీట్లను పలు కాలేజీలు రద్దు చేసుకున్నాయి. ఆయా కోర్సుల స్థానంలో CSE, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI), డేటా సైన్స్ (Data Science), సైబర్ సెక్యూరిటీ వంటి కోర్సుల్లో సీట్ల పెంపునకు చేసుకున్న దరఖాస్తులకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కొత్తగా వచ్చే కోర్సుల్లో కన్వీనర్ కోటా ద్వారా 70 శాతం కేటాయించగా.. 30 శాతం యాజమాన్య కోటా ద్వారా భర్తీ చేయనున్నారు. రెండో దశ కౌన్సెలింగ్ పూర్తయిన తర్వాత వెంటనే ప్రత్యేక రౌండ్ కౌన్సెలింగ్ చేపట్టనున్నారు.
Read Also : Khel Ratna : ఖేల్ రత్నాలు వీరే..12 మంది క్రీడాకారులు