ISRO: సత్తాచాటిన ఇస్రో.. విజయవంతంగా మేఘ-ట్రోఫికస్-1 ఉపగ్రహం ధ్వంసం

ISRO: భూ కక్ష్యలో పరిభ్రమిస్తున్న మేఘ-ట్రోఫికస్-1 (ఎంటీ1) ఉపగ్రహాన్ని ఇస్రో విజయవంతంగా ధ్వంసం చేసింది. భూమిపై వాతావరణ పరిస్థితులను అంచనా వేసేందుకు 2011లో ఫ్రెంచ్ స్పేస్ ఏజెన్సీ సహకారంతో ఇస్రో ఈ ఉపగ్రహాన్ని పంపగా 2021 సంవత్సరంలో దాని పనితీరు పూర్తిగా నిలిచిపోయింది. దీంతో.. పదేళ్లు సేవలందించిన తరువాత మంగళవారం సాయంత్రం ఉపగ్రహాన్ని భూ వాతావరణంలోకి ప్రవేశించిన అనంతరం పసిఫిక్ మహాసముద్రం‌పైన గగనతలంలో కాలిబూడిదైంది. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో ఉపగ్రహాలను అంతరిక్షంలోనే ధ్వంసం చేసే సత్తా అమెరికా, రష్యా, చైనాలతో పాటు భారత్ కే ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు.