తీపి గురుతులు : పెళ్లి రోజును గుర్తు చేసుకున్న అమృత ప్రణయ్

  • Published By: veegamteam ,Published On : January 30, 2019 / 05:20 AM IST
తీపి గురుతులు : పెళ్లి రోజును గుర్తు చేసుకున్న అమృత ప్రణయ్

దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన పరువు హత్యల్లో నల్గొండ జిల్లా మిర్యాలగూడ ప్రణయ్ ఒకటి. అమ్మాయి తండ్రి కిరాతకానికి బలైన ప్రణయ్ పెళ్లి జరిగింది జనవరి 30వ తేదీనే. 2018వ సంవత్సరం ఇదే రోజు హైదరాబాద్ లో అమృతను పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత.. కొన్ని రోజులు సిటీలో ఉన్న వీరు.. మిర్యాలగూడ ఇంటికి వెళ్లారు. అప్పటి నుంచి వేధింపులు, బెదిరింపులు వచ్చాయి. చాలాసార్లు పంచాయితీలు జరిగాయి. ప్రణయ్ దగ్గరే ఉంటానంటూ అమృతి తెగేసి చెప్పటం, కన్నవాళ్లను సైతం కాదనుకుంది. ఆ తర్వాత అమృత తండ్రి సుపారీ ఇచ్చి ప్రణయ్ ను చంపించాడు. అప్పటికే అమృత గర్భిణి.

 

తన పెళ్లి రోజున సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది అమృత. జస్టిస్ ఫర్ ప్రణయ్ పేరుతో ఆనాటి అనుభవాలను పంచుకుంది. మన పెళ్లి అయ్యి ఏడాది అయ్యింది. గత ఏడాది ఇదే రోజున నీ కోసం నేను.. నీ చెయ్యి పట్టుకుని నడిచేందుకు ఆతృతగా ఎదురుచూసిన సమయం అది.. ఇప్పుడు నీ బేబిని నా చేతుల్లో పెట్టుకుని మోయడానికి ఎదురుచూస్తున్నాను. ఇది త్వరలోనే నెరవేరబోతుంది. లవ్ యూ లల్లూ.. నిన్ను చాలా మిస్ అవుతున్నాను అంటూ కామెంట్ చేసింది.

 

తన పెళ్లి రోజునాటి జ్ణాపకాలను నెటిజన్లతో పంచుకున్న అమృతకు నెటిజన్లు శుభాకాంక్షలు చెబుతున్నారు. ప్రణయ్ ను మిస్ కావటం బాధకలిగించింది అంటూ ఓదార్పులు కూడా చెబుతున్నారు. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అంటూ పెద్దఎత్తున విషెస్ వెల్లువెత్తుతున్నాయి. మళ్లీ ప్రణయ్ పుట్టాలని చాలా మంది కోరుకుంటూ.. తమ ఆకాంక్షలను మెసేజ్ రూపంలో ఇస్తున్నారు. స్ట్రాంగ్ గా ఉండాలని ధైర్యం చెబుతున్నారు.