బయో డైవర్సిటీ ఫ్లైఓవర్‌ కారు ప్రమాదంపై రిపోర్ట్ ఇచ్చిన నిపుణుల కమిటీ

  • Published By: veegamteam ,Published On : December 17, 2019 / 06:54 AM IST
బయో డైవర్సిటీ ఫ్లైఓవర్‌ కారు ప్రమాదంపై రిపోర్ట్ ఇచ్చిన నిపుణుల కమిటీ

బయో డైవర్సిటీ ఫ్లైఓవర్‌ కారు ప్రమాదంపై విచారణ జరిపేందుకు ప్రభుత్వం నిపుణులతో కమిటీ వేసిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదానికి ఫ్లైఓవర్ డిజైనే కారణమని విమర్శలు వచ్చాయి. దీనిపై ప్రభుత్వం కమిటీని నియమించింది. దీనిపై విచారణ చేపట్టిన నిపుణుల కమిటీ వంతెన నిర్మాణానికి అవసరమైన భూమిని సేకరించే విషయంలో రాజీపడ్డారనీ..వంతెన నిర్మాణంలో మలుపుల వల్లే ప్రమాదం జరిగిందని నివేదిక తేల్చింది. వంతెనలో ఎక్కువ మలుపులు ఉన్నాయనీ..ఈ మలుపుల్లో బాగా అనుభవం ఉన్నవారు మాత్రమే డ్రైవింగ్ చేయగలరనీ నిపుణుల కమిటీ తేల్చింది. దీనివల్లే ప్రమాదం జరిగిందని నివేదిక తేల్చింది. 

బ్రిడ్జి డిజైన్ పరంగా చూస్తే స్పీడ్ గా వెళ్లే వాహనదారులకు ఏమాత్రం సేఫ్టీ కాదనీ నిపుణుల కమిటీ తేల్చింది. ఈ ఫ్లైఓవర్‌పై వెళ్లే వెహికల్స్ గంటకు 40 కిలోమీటర్ల గరిష్ఠ వేగంతో ప్రయాణించడానికి వీలుగా స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని కూడా కమిటీ సూచించింది. ఫ్లైఓవర్ నిర్మాణంలో రెండు డేంజరస్ మలుపులతో తక్కువ పొడవున్న ఫ్లైఓవర్ ఎటువంటి విపత్కర పరిస్థితులకు తావిస్తుందనే కోణంలో ఇంజనీర్లు దృష్టి పెట్టలేదని దీనికి సంబంధించిన విషయంలో ఇంజనీర్లు తగిన జాగ్రత్తలు తీసుకోవాలేని కమిటీ అభిప్రాయపడింది.

స్ట్రేటజిక్ రోడ్స్ డెవలప్‌మెంట్ స్కీమ్ (ఎస్‌ఆర్డీపీ) కింద నిర్మించిన బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ నవంబరు 4న అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఖాజాగూడ జంక్షన్ నుంచి మైండ్‌స్పేస్‌ వరకూ వన్‌వేలో వెళ్లే వాహనాలకు మాత్రమే పర్మిషన్ ఉంటుంది. ఈ ఫ్లై ఓవర్ పై నవంబరు 9న జరిగిన ప్రమాదంలో ఇద్దరు యువకులు మరణించారు. అది జరిగిన కొద్ది రోజులకే 23న రెండవ ప్రమాదం జరిగింది. 104 కిలోమీటర్ల వేగంతో దూసుకొచ్చిన ఫోక్స్ వ్యాగన్ పోలో మలుపు దగ్గర బ్రిడ్జి ప్రహరీని ఢీకొట్టి కింది రోడ్డు మీదకు పల్టీ కొట్టింది. ఈ ఘటనలో ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనతో బ్రిడ్జి డిజైన్‌లో లోపాలున్నాయని విమర్శలు వచ్చాయి. దీంతో జీహెచ్ఎంసీ నిపుణులతో కమిటీ వేసింది.

ఫ్లైఓవర్ పొడవు ఒక కిలోమీటరు కన్నా తక్కువ అంటే 990 మీటర్లు. అంత తక్కువ పొడవున్న వంతెన ‘ఎస్‌’ ఆకారంలో నిర్మించారు. ఈ నిర్మాణంలో రెండు చోట్ల మలుపులు అత్యంత ప్రమాదంగా ఉన్నాయని నిపుణుల కమిటీ తేల్చింది. ప్రమాదంగా మలుపు తిరిగిందని నిపుణుల కమిటీ తెలిపింది. 

బ్రిడ్జి లోటుపాట్లపై అధ్యయనానికి రాష్ట్ర ప్రభుత్వం నియమించిన కమిటీలో ప్రపంచ బ్యాంకు రోడ్డు భద్రత విభాగం అడ్వైజర్ ప్రొఫెసర్‌ నాగభూషణరావు, నిపుణులు డాక్టర్‌ టీఎస్‌ రెడ్డి, సహాయ ప్రొఫెసర్‌ శ్రీనివాస్‌కుమార్‌, ప్రదీప్‌రెడ్డి తదితరులు ఉన్నారు. ఈ కమిటీ తన నివేదికను జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేశ్‌కుమార్‌కు సమర్పించింది.