మెట్రో ప్రయాణికులకు ఐపీఎల్ ఆఫర్

ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా మెట్రో రైలు మేనేజ్మెంట్ బంపర్ ఆఫర్ ఇచ్చింది.

మెట్రో ప్రయాణికులకు ఐపీఎల్ ఆఫర్

ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా మెట్రో రైలు మేనేజ్మెంట్ బంపర్ ఆఫర్ ఇచ్చింది.

ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా మెట్రో రైలు మేనేజ్మెంట్ బంపర్ ఆఫర్ ఇచ్చింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ మార్చి 29 శుక్రవారం ఉప్పల్ స్టేడియం వేదికగా జరగనుంది. ఐపీఎల్ సీజన్ 2019లో హైదరాబాద్‌లో జరుగుతోన్న తొలి మ్యాచ్ కావడంతో వీక్షించేందుకు టిక్కెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. 
Read Also : భ్రష్టు పట్టిస్తోంది : ఏంటీ ‘Bigo Live’.. మాయలో కుర్రోళ్లు

భారీ సంఖ్యలో స్టేడియానికి ప్రేక్షకులు భారీ సంఖ్యలో వస్తారని ముందుగానే అంచనా వేసిన హైదరాబాద్ మెట్రో రైలు నిర్వాహకులు అర్థరాత్రి వరకూ సేవలు కొనసాగించే ఏర్పాటు చేశారు. ఈ విషయాన్ని మెట్రో రైలు యాజమాన్యం అధికారికంగా ట్విట్టర్ ఖాతా ద్వారా ప్రకటించింది. 
Read Also : ప్రయాణికులకు గుడ్ న్యూస్ : వెయ్యి రైల్వే స్టేషన్లలో ఫ్రీ Wi-Fi

‘ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్(సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్) కారణంగా హైదరాబాద్ మెట్రో రైలు సేవలు అర్థరాత్రి వరకూ కొనసాగించనున్నాయి. కేవలం స్టేడియం మెట్రో స్టేషన్ నుంచి మాత్రమే ఈ సేవలు అందుబాటులో ఉంటాయి. అంటే రాత్రి 11.45నిమిషాల వరకూ ప్రయాణికులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు ఈ ఏర్పాటు చేశాం’ అని ట్విట్టర్ ద్వారా తెలిపింది.  

Read Also : ఇప్పుడే రీఛార్జ్ చేసుకోండి : జియో టాప్ 5 డేటా ప్లాన్ ఆఫర్లు ఇవే