చైనా ప్ర‌భుత్వం ఆదేశించాకే భారతీయ సైనికులపై దాడి : అమెరికా ఇంటెలిజెన్స్ నివేదిక‌

  • Published By: vamsi ,Published On : June 23, 2020 / 08:17 AM IST
చైనా ప్ర‌భుత్వం ఆదేశించాకే భారతీయ సైనికులపై దాడి : అమెరికా ఇంటెలిజెన్స్ నివేదిక‌

జూన్ 15వ తేదీ రాత్రి గాల్వన్ లోయలో 20 మంది భారతీయ సైనికులు అమరవీరులవగా.. చైనా ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల ప్ర‌కార‌మే ఆ దేశ సైనికులు భార‌త సైన్యంపై దాడి చేసిన‌ట్లుగా అమెరికా ఇంటెలిజెన్స్ నివేదిక వెల్లడించింది.

జూన్ 15వ తేదీన గాల్వ‌న్ లోయ‌లో జ‌రిగిన ఘ‌ర్ష‌ణ‌లో 20 మంది భార‌తీయ సైనికులు చనిపోగా.. బండ రాళ్లు, మేకులు ఉన్న‌ ఐర‌న్ రాడ్ల‌తో చైనా సైనికులు భార‌త జ‌వాన్ల‌పై దాడి చేసిన‌ట్లు అమెరికా త‌న రిపోర్ట్‌లో వెల్లడించింది.

ఈ ఘ‌ట‌నకు ముందు చైనా ప్రభుత్వ ఆదేశాలను ఆ దేశ సైన్యం తీసుకున్నట్లుగా అమెరికా ఇంటెలిజెన్స్ చెప్పింది. త‌ర్వాత రెండు దేశాల మ‌ధ్య ఉన్న స‌రిహ‌ద్దు ఉద్రిక్త‌త మ‌రింత తారా స్థాయికి చేరింది. అయితే చైనా ఇచ్చిన ఆదేశాల‌నే ఆ దేశ సైన్యం పాటించిన‌ట్లు అమెరికా ఇంటెలిజెన్స్ వెల్ల‌డించింది.

గల్వాన్ వ్యాలీలో జూన్ 15 న జరిగిన ఘర్షణలో భారత సైనికులపై దాడి చేయడానికి చైనా దళాలు రాళ్ళు, ముళ్ల తీగలతో చుట్టబడిన లాఠీలు, ఇనుప రాడ్లు మరియు గోళ్ళతో నిక్షిప్తం చేసిన క్లబ్లను ఉపయోగించినట్లు నివేదికలు సూచిస్తున్నాయి.