China Covid- 19 : చైనాలో ఒక్కరోజే 10,729 కోవిడ్ కేసులు నమోదు .. లాక్ డౌన్ ఆంక్షల్లో 10 లక్షలమంది
కోవిడ్ మహమ్మారి నుంచి ప్రపంచంలోఅన్ని దేశాలు కోలుకున్నాయి..కానీ కొవిడ్కు పుట్టినిల్లు అయినా చైనా మాత్రం మహమ్మారి కోరల నుంచి బయపడలేకపోతోంది. తాను తీసిన గొయ్యిలో తానే పడిన చందంగా అయిపోయింది డ్రాగన్ దేశం పరిస్థితి. ‘జీరో కోవిడ్’ పాలసీతో కోవిడ్ ను పూర్తిగా అంతమొందించాలనే లక్ష్యంతా చైనా ప్రభుత్వం తీసుకునే ఎటువంటి ఆంక్షలు కొత్త కేసుల పెరుగుదలను ఆపలేకపోతున్నాయి. శుక్రవారం ఒక్కరోజే 10,729 కొత్త కేసులు నమోదయ్యాయి.
China Covid- 19 : కోవిడ్ మహమ్మారి నుంచి ప్రపంచంలోఅన్ని దేశాలు కోలుకున్నాయి..కానీ కొవిడ్కు పుట్టినిల్లు అయినా చైనా మాత్రం మహమ్మారి కోరల నుంచి బయపడలేకపోతోంది. తాను తీసిన గొయ్యిలో తానే పడిన చందంగా అయిపోయింది డ్రాగన్ దేశం పరిస్థితి. ‘జీరో కోవిడ్’ పాలసీతో కోవిడ్ ను పూర్తిగా అంతమొందించాలనే లక్ష్యంతా చైనా ప్రభుత్వం తీసుకునే ఎటువంటి ఆంక్షలు కొత్త కేసుల పెరుగుదలను ఆపలేకపోతున్నాయి. లాక్ డౌన్ అనే మాట వింటేనే హడలిపోతున్న చైనీయులు ఆ ఆంక్షల్లోనే మగ్గిపోతున్న దుస్థితి నుంచి బయటపడలేకపోతున్నారు. కోవిడ్ ను నామరూపాలు లేకుండా చేయాలని ప్రభుత్వం తీసుకునే కఠిన చర్యలు కూడా పనిచేయటంలేదు. రోజు రోజుకు కోవిడ్ కొత్త కేసులు పెరుగుతునే ఉన్నాయి. దీంట్లో భాగంగా శుక్రవారం (నవంబర్ 11,2022) ఒక్కరోజే ఏకంగా 10,729 కొత్త కేసులు నమోదు అయ్యాయి. ఈ విషయాన్ని అధికారులే నిర్ధారించారు. అంటే ఇక అనధికారికంగా ఇంకా ఎన్నికేసులు ఉండి ఉంటాయో..
శుక్రవారం ఒక్కరోజే 10,729 కొత్త కేసులు నమోదైనా..పాజిటివ్ వచ్చిన వారిలో ఎలాంటి లక్షణాలు లేకపోవడం మరో ఆందోళన కలిగిస్తోంది. వైరస్ కట్టడికి అధికారులు కఠిన ఆంక్షలు విధించి జీరో కొవిడ్ వ్యూహాన్ని అమలు చేస్తున్నా ఫలితాలు మాత్రం ఆశాజనకంగా లేవు. ఇటువంటి పరిస్థితుల్లో కోవిడ్ ఆంక్షల మధ్య చైనీయులు మగ్గిపోతున్నారు. ఘ్వాంగ్జౌవ్, ఛాంగ్క్వింగ్ నగరాల్లో.. దాదాపు 50 లక్షల మంది కఠినా లాక్డౌన్ ఆంక్షల మధ్య ఉన్నారు. రాజధాని బీజింగ్లో ఒక్కరోజే 118 కొత్త కేసులు వెలుగు చూసినట్లు అధికారులు తెలిపారు. దీంతో అక్కడున్న రెండు కోట్లకుపైగా ప్రజలకి రోజువారీ కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు.
వైరస్ కట్టడికి జీరో కొవిడ్ వ్యూహాన్ని అమలు చేస్తున్నా ఈ స్థాయిలో కేసులు నమోదు కావడం అక్కడి అధికారులను కలవరానికి గురిచేస్తోంది. ఎన్ని ఆంక్షలు అమలు చేస్తున్నా కొవిడ్ అదుపులోకి రాకపోవడంతో అధికారులు ఆందోళనకు గురవుతున్నారు. కరోనా పాజిటివ్ సంఖ్య పెరగడంతో రాజధాని బీజింగ్లోని పార్కులను అధికారులు మూసివేశారు. దేశవ్యాప్తంగా మరోసారి కఠిన ఆంక్షలను విధిస్తున్నారు. మరోవైపు పాఠశాలలన్నీ ఆన్లైన్ తరగతులకు పరిమితం చేస్తున్నారు. ఆసుపత్రుల్లో అత్యవసర సేవలను మాత్రమే అందుబాటులోకి తెచ్చారు. రెస్టారెంట్స్, దుకాణాలను మూయించిన అధికారులు అందులో పనిచేస్తున్న వారిని క్వారంటైన్కు తరలించారు.
కొవిడ్ కట్టడికి విధించిన కఠిన ఆంక్షలను తట్టుకోలేని చైనా ప్రజలు కొన్ని ప్రాంతాల్లో పోలీసులు, వైద్య సిబ్బందితో వాగ్వాదానికి దిగుతున్నారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ఇటీవల సోషల్ మీడియాలో వైరల్గా మారిన విషయం తెలిసిందే. ఆంక్షలకు వ్యతిరేకంగా స్థానిక ప్రజల్లో వ్యక్తమవుతున్న నిరాశపై చైనా అధికారులు స్పందించారు. కేసులు భారీగా ఉన్న నగరాలను మినహాయించి మిగతా ప్రాంతాల్లోని ప్రజలను లాక్ డౌన్ నిర్బంధం నుంచి విడిచిపెడతామని హామీ ఇచ్చారు. కానీ అటువంటి పరిస్థితులు ఎక్కడా కనిపించటంలేదు. కోవిడ్ కు పుట్టినిల్లుగా భావిస్తున్న చైనా ఈనాటికి ఆ కోరల్లోనే జీవిస్తు పరిస్థితి నెలకొంది.