Covid Warns: కోవిడ్‌ వైరస్ ఇంకా స్ట్రాంగ్ గానే ఉంది..కొత్త వేరియంట్లు పుట్టుకొస్తాయ్..నిబంధనలు తప్పనిసరి ‌: WHO

కోవిడ్‌ వైరస్ ఇంకా స్ట్రాంగ్ నే ఉంది..కొత్త వేరియంట్లు పుట్టుకొస్తాయ్..నిబంధనలు తప్పనిసరి. అని WHO హెచ్చరికలు జారీ చేసింది.

Covid Warns: కోవిడ్‌ వైరస్ ఇంకా స్ట్రాంగ్ గానే ఉంది..కొత్త వేరియంట్లు పుట్టుకొస్తాయ్..నిబంధనలు తప్పనిసరి ‌: WHO

Who Covid Warns

WHO Covid Warns: కోవిడ్ మొదటి వేవ్, సెకండ్ వేవ్ లతో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. థర్డ్ వేవ్ అంటూ తీవ్రంగా భయపడినా అది పెద్దగా ప్రభావం చూపలేదు. థర్డ్ వేవ్ కూడా ముగిసిపోయింది. ఇక ప్రశాంతంగా ఊపిరి పీల్చుకోవచ్చు అని అనుకున్నాం. అంటే కరోనా మహమ్మారి బలహీనపడిపోయింది. ఇక ఏమీ ఫరవాలేదు. హాయిగా ఉండొచ్చు అని అనుకుంటున్న క్రమంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ‘కోవిడ్ వైరస్ (Covid New Variants)ఇంకా బలంగానే ఉంది..కొత్త వేరియంట్లు పుట్టుకురావచ్చు కాబట్టి తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాల్సిందే’అంటూ చేసిన హెచ్చరికలు మరోసారి భయాందోళనలకు గురి చేస్తున్నాయి.

అంటే ఫోర్త్ వేవ్ తప్పదా?అనే భయాందోళనలు నెలకొన్నాయి. కోవిడ్ వైరస్ కు పుట్టినిల్లుగా చెబుతున్న చైనాలో రెండు ఏళ్ల తరువాత మరోసారి కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. దీంతో మరోసారి భయపడాల్సి వస్తోంది. ఈక్రమంలో కోవిడ్ ఏమాత్రం బలహీన పడలేదని..ఇంకా బలంగానే ఉందని కొత్త వేరియంట్లు పుట్టుకురావచ్చు అని ప్రపంచఆరోగ్య సంస్థ వార్నింగ్ ఇచ్చింది.దీంతో ఫోర్త్ వేవ్ తప్పదా?అనే భయం నెలకొంది.

ఆసియా ఖండంతో పాటు యూరోప్‌ దేశాల్లో చాపకింద నీరులా వ్యాపిస్తున్న కోవిడ్..
కరోనా మహమ్మారి ఆసియా ఖండంతో పాటు యూరోప్‌ దేశాల్లో చాపకింద నీరులా వ్యాపిస్తోంది. గత రెండేళ్లకుపైగా కొనసాగుతున్న కరోనా విజృంభణ.. తగ్గుముఖం పట్టిందనుకునే లోపే మళ్లీ కేసులు పెరిగిపోతున్నాయి. ఆసియా ఖండంతో పాటు యూరోప్‌ దేశాల్లో పెరుగుతున్న కరోనా కేసుల (Corona Cases) పెరుగుతన్న క్రమంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రపంచ దేశాలను అప్రమత్తం చేసింది. పెరుగుతున్న కరోనా కేసుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని పదే పదే సూచిస్తోంది. కోవిడ్ తగ్గుముఖం పట్టిందని భావించకూడదని, దేశాలు కరోనా నిబంధనలు పాటించాలని సూచిస్తోంది.

కరోనా ఇంకా స్ట్రాంగ్ గానే ఉంది : WHO
కరోనా ఇంకా చాలా దృఢంగానే ఉందని, నిర్లక్ష్యం చేస్తే మరింత ముప్పు ఉండే అవకాశం ఉందని WHO ప్రపంచ దేశాలను హెచ్చరిస్తోంది. వ్యాక్సినేషన్‌ ప్రక్రియ తగ్గుముఖం పట్టడంతో కోవిడ్‌ వ్యాప్తి మరింతగా ఉందని వెల్లడించింది. వైరస్‌ ఇంకా పూర్తిగా క్షీణించలేదని, సీజనల్‌ వ్యాధిలా మారలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) అత్యవసర విభాగానికి చెందిన హెడ్‌ డాక్టర్‌ మైక్‌ ర్యాన్‌ స్పష్టం చేశారు.

మరో సంవత్సరం అప్రమత్తత తప్పనిసరి : WHO
కరోనా విషయంలో మరో ఏడాది పాటు అప్రమత్తంగా ఉండాలని డబ్ల్యూహెచ్‌ సూచిస్తోంది. లేదంటే కొత్త వేరయంట్లు పుట్టుకువచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తోంది. యూకే, దక్షిణ కొరియా దేశాల్లో పెరుగుతున్న కరోనా కేసుల కారణంగా మనమంతా అప్రమత్తంగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ అధికారులు సూచిస్తున్నారు. వైరస్‌ ఇంకా ఎంతో దృఢంగానే ఉందని, ఈ విషయాన్ని సైతం నిపుణులు ధృవీకరించారు.

టీకాలు శక్తి తగ్గుతోంది..వైరస్ పెరుగుతోంది..
కోవిడ్ మహమ్మారికి టీకాలు వచ్చి ఏడాది దాటింది. వాటిని వేయించుకున్నా..వాటి శక్తి నిరంతరము ఉండదు. ఈక్రమంలో వ్యాక్సిన్ల శక్తి తగ్గిపోయి రోగనిరోధక శక్తి మరింతగా క్షీణిస్తున్న క్రమంలో ప్రపంచ వ్యాప్తంగా మహమ్మారి మళ్లీ వణికిస్తోందని డాక్టర్‌ మైక్‌ ర్యాన్‌ హెచ్చరించారు. రానున్న రోజుల్లో కొత్త వేరియంట్లు పుట్టుకువచ్చే అవకాశాలు చాలా ఉన్నాయని కాబట్టి ప్రతీ ఒక్కరు జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు.

ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర స్థాయిలో ఒమిక్రాన్‌..
ప్రస్తుతం కోవిడ్ తగ్గుముఖం పట్టినా..పూర్తిగా అయితే పోలేదు. ఈ మధ్యలో కొత్త కొత్త వేరియంట్లు హడలెత్తించాయి. ఈ కొత్త కొత్త వేరియంట్లు పుట్టుకువచ్చి మరింతగా విజృంభించే అవకాశాలున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఒమిక్రాన్‌ వ్యాప్తి ఇంకా తీవ్ర స్థాయిలోనే ఉందని, కొద్ది రోజుల క్రితమే డబ్ల్యూహెచ్‌వో స్పష్టం చేసింది. కోవిడ్ స్వల్ప విరామం తీసుకుని మళ్లీ విజృంభించే అవకాశం చాలా ఉందని..అందుకే వైరస్‌ కేసులు మళ్లీ పెరుగుతున్నాయని తెలిపారు. కాబట్టి కేసులు పెరుగుతున్న క్రమంలో ప్రతీ ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని, కరోనా నిబంధనలు తప్పకుండా పాటించాలని డబ్ల్యూహెచ్‌వో అధికారులు సూచిస్తున్నారు. మాస్క్‌లు ధరించడం, భౌతిక దూరం పాటించడం, శానిటైజేషన్ వంటి నిబంధనలు తప్పకుండా పాటించాలి అని సూచిస్తున్నారు. అలాకాకుండా నిర్లక్ష్యం వహిస్తే మరోసారి కోవిడ్ తన ప్రతాపాన్ని చూపిస్తుందని..హెచ్చరిస్తున్నారు.

చైనాలో రెండేళ్ల తరువాత రెండు మరణాలు..
కోవిడ్ కు పుట్టినిల్లు చైనాలో రెండేళ్ల తర్వాత కొత్తగా కోవిడ్ కేసులు తీవ్రస్థాయిలో పెరుగుతున్నాయి. దీంతో చైనా ఆయా ప్రాంతాల్లో లాక్ డౌన్ కూడా విధిస్తోంది.తాజాగా రెండు కరోనా మరణాలు సంభవించినట్లు చైనా జాతీయ ఆరోగ్య అధికారులు వెల్లడించారు. చైనాలో మరోసారి రోజువారిగా వేలల్లో పాజిటివ్‌ కేసులు నమోదు అవుతున్నాయి. కరోనా కేసులు పెరుగుతుండటంతో చైనాలోని 13 ప్రధాన నగరాల్లో లాక్‌డౌన్‌ ఆంక్షలు విధిస్తోంది చైనా ప్రభుత్వం. కాబట్టి ప్రతీ ఒక్కరు తప్పనిసరిగా జాగ్రత్తగా ఉండి తీరాలి.లేదంటే ముప్పు తప్పదు అని హెచ్చరిస్తోంది ప్రపంచ ఆరోగ్య సంస్థ.