కరోనా అంటే నాకు లెక్కలేదని, ఫ్రెండ్స్‌ని తీసుకొని రెస్టారెంట్‌కెళ్లింది. తిన్న16మందికి కరోనా అంంటించింది

  • Published By: srihari ,Published On : June 18, 2020 / 11:16 AM IST
కరోనా అంటే నాకు లెక్కలేదని, ఫ్రెండ్స్‌ని తీసుకొని రెస్టారెంట్‌కెళ్లింది. తిన్న16మందికి కరోనా అంంటించింది

అసలే బయట కరోనా ఉంది.. ఈ పరిస్థితుల్లో బయట భోజనం చేయాలంటేనే హడలిపోతున్నారు జనం. కానీ, ఓ మహిళ తన స్నేహితులతో కలిసి రెస్టారెంటుకు వెళ్లింది. సరదాగా కబుర్లు చెప్పుకుంటూ రెస్టారెంటులో రుచికరమైన భోజనాన్ని లొట్టలేసుకుంటు తిన్నారు. కానీ, చివరికి తేలింది.. వారికి కరోనా సోకిందని. ఆ మహిళతో పాటు 16 మంది తన స్నేహితులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. 

విషయం తెలిసిన వీరంతా షాక్ అయ్యారు. తమ నిర్లక్ష్యం కారణంగానే ఇలా జరిగిందంటూ బాధపడ్డారు. ఈ ఘటన JACKSONVILLE BEACH, Flaలోని ఒక రెస్టారెంట్‌లో జరిగింది. ఈ రెస్టారెంటులో ఫ్లోరిడాకు చెందిన మహిళ తన 15 మంది స్నేహితులతో కలిసి విందుకు వెళ్లింది. ఆ తర్వాత వారందరికి కరోనావైరస్ పాజిటివ్ తేలింది. Erika Crisp బాధిత మహిళ మాట్లాడుతూ.. ఆదే రోజు రాత్రి నుంచి తాను అనారోగ్యంతో ఉన్నట్టు తెలిపింది. 

కరోనా వ్యాప్తితో నెలల తరబడి ఇంటికే పరిమితమైన ఆమె తన స్నేహితులతో కలిసి జూన్ 6న లించ్ లోని ఐరిష్ పబ్ దగ్గర విందు చేయాలని నిర్ణయించుకున్నట్టు ఆరోగ్య కార్యకర్త ఒకరు చెప్పారు. అయితే విందు తర్వాత, Crisp, ఆమె స్నేహితులు అందరికి వైరస్ సోకినట్టు తెలిపారు. రెస్టారెంట్లు తిరిగి తెరవడంతో విందు చేసేందుకు వెళ్లామని ఆమె చెప్పింది. మాస్క్ లు ధరించకుండా తాము నిర్లక్ష్యంగా ఉన్నామని తెలిపింది. జాక్సన్విల్లే బీచ్‌లోని లించ్ ఐరిష్ పబ్‌లో ఏడుగురు ఉద్యోగులకు COVID-19 సోకినట్టు నిర్ధారణ అయింది. దాంతో అక్కడి జనరల్ మేనేజర్ గత వారంలోనే స్వచ్ఛందంగా రెస్టారెంట్ మూసివేసి శానిటైజ్ చేయించినట్టు చెప్పారు.