Sundar Pichai: ఇంటర్నెట్ స్వేచ్ఛపై దాడి జరుగుతోంది -సుందర్ పిచాయ్
"ఉచిత మరియు బహిరంగ ఇంటర్నెట్పై అనేక దేశాలలో దాడిలో జరుగుతుంది" అని గూగుల్ బాస్ సుందర్ పిచాయ్ అన్నారు.
Sundar Pichai: “ఉచిత మరియు బహిరంగ ఇంటర్నెట్పై అనేక దేశాలలో దాడిలో జరుగుతుంది” అని గూగుల్ బాస్ సుందర్ పిచాయ్ అన్నారు. అనేక దేశాలు సమాచార మార్పిడికి అడ్డుకుంటుంటున్నాయని, అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నాయని ఇంటర్నెట్ను చాలా ఆషామాషీగా తీసుకుంటూ విఘాతం కలిగిస్తున్నట్లు అభిప్రాయపడ్డారు.
ఇటువంటి పనులు అభివృద్ధి చెందుతున్న దేశాలు వెనకడుగు వెయ్యడమే అని అన్నారు సుందర్ పిచాయ్. ఉచిత మరియు బహిరంగ ఇంటర్నెట్ అనేది మంచిని పెంచే విపరీతమైన శక్తి అని అన్నారు పిచాయ్.
కానీ..మనం దీన్ని ఆషామాషీగా తీసుకుంటున్నాం’’ అని పిచాయ్ అన్నారు. “విభిన్న ఇంటర్నెట్స్” అనే అంశంపై అడిగిన ప్రశ్నలకు సమాధానంగా.. ఆన్లైన్లో ఏరకమైన వ్యాఖ్యలు ఆమోదయోగ్యం, ఏవి కావు అనే అంశంపై వివిధ దేశాలు భిన్నమైన చట్టాలు తీసుకుని వచ్చాయని, చట్టాలతో స్వేచ్చగా వారి భావనలను చెప్పకుండా ఆపడం మంచి పద్ధతి కాదని అన్నారు.
“ప్రతి దేశంలో ఇప్పుడు వారి భావప్రకటన అనుమతి ఇవ్వాలనే చర్చ జరుగుతోంది. ప్రపంచంలోని అనేక దేశాలు సమాచార మార్పిడిని పరిమితం చేస్తున్నాయి మరియు మరింత కఠినమైన సరిహద్దులను గీస్తున్నాయి. అది మంచి పద్ధతి కాదు”అని పిచాయ్ చెప్పారు.
“బలమైన ప్రజాస్వామ్య సంప్రదాయాలు మరియు విలువలు కలిగిన దేశాలు” ఇంటర్నెట్ విచ్ఛిన్నం కాకుండా ఉండేందుకు సహకరించేలా ప్రజలు నిలబడాలని కోరారు. సోషల్ మీడియా ప్లాట్ఫాంలు, న్యూస్ పబ్లిషర్స్, ఒటిటి వెబ్సైట్లు మరియు సెర్చ్ ఇంజన్లు (గూగుల్ వంటివి) భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త చట్టాలతో ముడిపడి ఉండటంపై పిచాయ్ వ్యాఖ్యానించారు.
చట్టాలు వినియోగదారులను శక్తివంతం చేస్తాయి మరియు రక్షిస్తాయని ప్రభుత్వం నొక్కి చెబుతుంది. ప్రభుత్వాలకు నచ్చని కంటెంట్ను 36 గంటల్లోపు తొలగించడంపై ప్రభుత్వ ఆదేశాలను పాటించాల్చి వస్తుందని చెప్పుకొచ్చారు. ఈ నియమాలు వినియోగదారుల గోప్యత హక్కును మరియు భావ ప్రకటనా స్వేచ్ఛను ఉల్లంఘించినట్లే అని విమర్శకులు అభిప్రాయపడుతున్నారు.