Hailstorm: విషాదం: వడగండ్ల వానకు 21 మంది మృతి

చైనా విషాదం చోటుచేసుకుంది. మారథాన్ జరుగుతుండగా వడగండ్ల వర్షం కురవడంతో 21 మంది మృతి చెందగా పలువురికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన ఈశాన్య చైనా హువాంగే షిలిన్‌ పర్వతాల చోటుచేసుకుంది. వాతావరణం పొడిగా ఉండటంతో శనివారం ఉదయం 100 కిలోమీటర్ల అల్ట్రామారథాన్‌ మొదలుపెట్టారు. మారథాన్ మొదలైన టైములో వాతావరణం పొడిగా ఉంది.

Hailstorm: విషాదం: వడగండ్ల వానకు 21 మంది మృతి

Hailstorm

Hailstorm: చైనా విషాదం చోటుచేసుకుంది. మారథాన్ జరుగుతుండగా వడగండ్ల వర్షం కురవడంతో 21 మంది మృతి చెందగా పలువురికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన ఈశాన్య చైనా హువాంగే షిలిన్‌ పర్వతాల చోటుచేసుకుంది. వాతావరణం పొడిగా ఉండటంతో శనివారం ఉదయం 100 కిలోమీటర్ల అల్ట్రామారథాన్‌ మొదలుపెట్టారు. మారథాన్ మొదలైన టైములో వాతావరణం పొడిగా ఉంది. మధ్యాహ్నం అయ్యేసరికి ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. ఒక్కసారిగా వడగండ్ల వర్షం కురిసింది. దీంతో మారథాన్ లో పాల్గొన్న అథ్లెట్లు పక్కనే ఉన్న కొండల్లోకి వెళ్లిపోయారు. యెల్లో రివర్‌ స్టోన్‌ఫారెస్ట్‌ వెంట పరుగులు తీస్తున్న వాళ్లలో చాలామంది హైపోథెర్మియాకు గురయ్యారు.

వీరిలో 21 మంది మృతి చెందగా మరికొందరు ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్లు సమాచారం. మొత్తం 172 మంది ఈ రేస్ లో పాల్గొనగా 100 మందికిపైగా అథ్లెట్ల ఆచూకీ లభించలేదు. దీంతో 1200 రెస్క్యూ టీమ్స్ రంగంలోకి దిగాయి. సెర్చ్ ఆపరేషన్ ముమ్మరం చేశాయి. ఆదివారం ఉదయానికి 151 మందిని కనుగొన్నారు.. వీరిలో 21 మంది మృతి చెందారు. ఇక కొందరిని ఆసుపత్రిలో చేర్చారు రెస్క్యూ సిబ్బంది. 21 మంది చలిని తట్టుకోలేక గడ్డకట్టుకుని చనిపోయారని అధికారులు వెల్లడించారు.

మారథాన్‌లో పాల్గొన్నవాళ్లు షార్ట్స్‌ ,టీషర్ట్స్‌ ధరించడం కూడా వాళ్ల మృతికి ఒక కారణమైందని అధికారులు అంటున్నారు. ఇక గాయపడిన వ్యక్తి మీడియాతో మాట్లాడాడు.. హఠాత్తుగా చీకటి అలుముకుందని తన నాలుకతో పాటు వేలు గడ్డకట్టాయని తెలిపాడు. వెంటనే సమీపంలోని చెట్టుతొర్రలో దాక్కునని వివరించాడు. కాగా ఈ ఘటనలో మరికొందమంది మరణించే అవకాశం ఉందని అక్కడి అధికారులు చెబుతున్నారు.