కరోనా సోకి సుమో రెజ్లర్ మృతి : ఏనుగులాంటివాడిని మట్టికరిపించేసిన మహమ్మారి
కరోనా వైరస్ సోకి ఏనుగులాంటి సుమో రెజ్లర్ ప్రాణాలు కోల్పోయాడు. జపాన్కు చెందిన 28 ఏళ్ల సుమో రెజ్లర్.. కరోనా వైరస్ కు బలైపోయాడు. ఓ వైరస్ వల్ల సుమో రెజ్లర్గా చనిపోవడం ఇదే తొలి ఘటన. జపాన్ సుమో సంఘం ఈ విషయాన్ని దృవీకరించింది. రెజ్లర్ షోబుషి అసలు పేరు కియోటకా సుటేకా.
అకియోటకా సుటేకా నెల రోజుల క్రితం అతను హాస్పిటల్లో చేరాడు. టోక్యో హాస్పిటల్లో అతను మృతిచెందినట్లు జపాన్ మీడియా పేర్కొన్నది. 2007లో షోబుషి ప్రొఫెషనల్ సుమో పోటీల్లో పాల్గొన్నాడు.
కెరీర్ బెస్ట్ ర్యాంకింగ్స్లో అతను 11వ స్థానంలో నిలిచాడు. ఏప్రిల్లో ఐదుగురు సుమో రెజ్లరకు వైరస్ సంక్రమించినట్లు జపాన్ సుమో సంఘం తెలిపింది. కరోనా మహమ్మారి వల్ల మే 24వ తేదీ నుంచి టోక్యోలో జరిగాల్సిన సుమో రెజ్లింగ్ పోటీలను కూడా వాయిదా వేశారు.చైనాలో పుట్టి ప్రపంచదేశాలను వణికిస్తున్న కరోనా వల్ల జపాన్లో ఇప్పటి వరకు 16,759 మందికి వైరస్ సంక్రమించింది. 691 మంది మరణించారు.
అకియోటకా సుటేకాకు కరోనా సోకినా ఏమాత్రం భయపడలేదు. కానీ ఫలితం లేకపోయింది. ఏనుగులాంటి అకియోటకా సుటేకా బలం కరోనా శక్తిముందు ఓడిపోయింది. అకియోటకా సుటేకా కరోనా వైరస్ కు ప్రాణాలు కోల్పోయాడు.