Pakistan : ఖైబర్ పఖ్తుంఖ్వాలో ఆత్మాహుతి దాడి… 9 మంది పాక్ సైనికుల మృతి

పాకిస్థాన్‌ దేశంలో మరో సారి ఆత్మాహుతి దాడి జరిగింది. ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రాంతంలో జరిగిన ఆత్మాహుతి బాంబు పేలుడులో 9 మంది సైనికులు మరణించారు. ఈ ఘటనలో మరో 17 మంది గాయపడ్డారు....

Pakistan : ఖైబర్ పఖ్తుంఖ్వాలో ఆత్మాహుతి దాడి… 9 మంది పాక్ సైనికుల మృతి

suicide blast in Khyber Pakhtunkhwa

Pakistan suicide blast : పాకిస్థాన్‌ దేశంలో మరో సారి ఆత్మాహుతి దాడి జరిగింది. ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రాంతంలో జరిగిన ఆత్మాహుతి బాంబు పేలుడులో 9 మంది సైనికులు మరణించారు. ఈ ఘటనలో మరో 17 మంది గాయపడ్డారు. మోటర్‌బైక్‌పై వచ్చిన ఆత్మాహుతి బాంబర్ మాలి ఖేల్ ప్రాంతంలో భద్రతా దళాల కాన్వాయ్‌పై దాడి చేసినట్లు పాక్ సైనికులు చెప్పారు. (9 Pak forces men killed) బన్నూ డివిజన్ ఘటనపై పాకిస్థాన్ తాత్కాలిక పీఎం అన్వర్ ఉల్ హక్ కకర్ విచారం వ్యక్తం చేశారు.

YS Sharmila : అసలు సోనియా గాంధీ ప్లాన్ ఏంటి? షర్మిలతో జగన్‌ను దెబ్బకొట్టనుందా?

‘‘కెపికెలోని బన్నూ డివిజన్‌లో 9 మంది వీర సైనికులను కోల్పోయిన పిరికి ఉగ్రవాద చర్యకు నా గుండె పగిలింది. అలాంటి చర్యలను ఖండిస్తున్నాను. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పాకిస్థాన్ దృఢంగా ఉంది’’ అని అన్వర్ ఉల్ హక్ కకర్ ఎక్స్ లో పోస్టు చేశారు. (suicide blast in Khyber Pakhtunkhwa)

Revanth Reddy : సమాజానికి ఆయన అవసరం ఎంతో ఉంది, కేసీఆర్‌ని తరిమికొట్టడానికి అంతా ఏకమవుతున్నాం- రేవంత్ రెడ్డి

ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రాంతంలో నెల రోజుల వ్యవధిలో ఇలాంటి ఘటన జరగడం ఇది రెండోసారి. ఈ ఏడాది జులై 30వతేదీన ఒక రాజకీయ పార్టీ సమావేశంలో ఆత్మాహుతి బాంబర్ పేలుడుకు పాల్పడటంతో 54 మంది మరణించారు, నాటి ఘటనలో మరో 100 మందికి పైగా గాయపడ్డారు.