UN report: అఫ్గాన్‌లో పాక్ ఉగ్ర‌వాద సంస్థ‌ల‌ శిక్ష‌ణ శిబిరాలు.. భార‌త్‌పై కుట్ర‌లు?

పాకిస్థాన్ కేంద్రంగా ప‌నిచేసే ఉగ్ర‌వాద సంస్థ‌లు జైషే మొహ‌మ్మ‌ద్, ల‌ష్క‌రే తాయిబా అఫ్గానిస్థాన్‌లోని ప‌లు ప్రావిన్స్‌ల‌లో ఉగ్ర‌వాద‌ శిక్ష‌ణ శిబిరాల‌ను కొన‌సాగిస్తున్నాయ‌ని ఐక్య‌రాజ్య స‌మితి ఓ నివేదిక‌లో తెలిపింది.

UN report: అఫ్గాన్‌లో పాక్ ఉగ్ర‌వాద సంస్థ‌ల‌ శిక్ష‌ణ శిబిరాలు.. భార‌త్‌పై కుట్ర‌లు?

Terroruse

UN report: పాకిస్థాన్ కేంద్రంగా ప‌నిచేసే ఉగ్ర‌వాద సంస్థ‌లు జైషే మొహ‌మ్మ‌ద్, ల‌ష్క‌రే తాయిబా అఫ్గానిస్థాన్‌లోని ప‌లు ప్రావిన్స్‌ల‌లో ఉగ్ర‌వాద‌ శిక్ష‌ణ శిబిరాల‌ను కొన‌సాగిస్తున్నాయ‌ని ఐక్య‌రాజ్య స‌మితి ఓ నివేదిక‌లో తెలిపింది. ల‌ష్క‌రే తాయిబా ఉగ్ర‌వాద సంస్థ 26/11 ముంబై ఉగ్ర‌వాద దాడుల సూత్ర‌ధారి హ‌ఫీజ్ స‌యీద్‌కి చెందినద‌న్న విష‌యం తెలిసిందే. అలాగే, జైషే మొహ‌మ్మ‌ద్, ల‌ష్క‌రే తాయిబా కొన‌సాగిస్తోన్న శిక్ష‌ణ శిబిరాల్లో కొన్ని నేరుగా తాలిబ‌న్ల ప‌ర్య‌వేక్ష‌ణ‌లో ఉన్నాయ‌ని ఐక్య‌రాజ్య స‌మితి తెలిపింది.

Shivraj Chouhan: అభివృద్ధిలో హైద‌రాబాద్‌ను ఇండోర్ అధిగ‌మిస్తుంది: మ‌ధ్య‌ప్ర‌దేశ్ సీఎం

ఉగ్ర‌వాద చ‌ర్య‌ల ప‌రిశోధ‌న‌, ఆంక్ష‌ల ప‌ర్య‌వేక్ష‌ణ బృందం సమర్పించిన 13వ నివేదిక‌లో ఆయా విష‌యాలు ఉన్నాయ‌ని ఐక్యరాజ్య సమితి చెప్పింది. ఈ బృందంలో ఐక్య‌రాజ్య స‌మితిలోని భార‌త శాశ్వ‌త ప్ర‌తినిధి టీఎస్ తిరుమూర్తి కూడా ఉన్నారు. తాలిబన్ల‌పై ఆంక్ష‌ల క‌మిటీ ఛైర్మ‌న్‌గానూ ఆయ‌న కొన‌సాగుతున్నారు. జైషే మొహ‌మ్మ‌ద్ సంస్థ భావ‌జాలప‌రంగా తాలిబ‌న్ల‌కు ద‌గ్గ‌ర‌గా ఉంటుందని ఆ సంస్థ‌ నంగర్హర్‌లో ఎనిమిది ఉగ్ర‌వాద శిబిరాలు నిర్వ‌హిస్తోంద‌ని తాజా నివేదిక ఆధారంగా ఐక్య‌రాజ్య స‌మితి పేర్కొంది.

Kamal Nath: నేను హిందువున‌ని గ‌ర్వంగా చెప్పుకుంటాను, కానీ..: క‌మ‌ల్‌నాథ్

వాటిలో మూడు నేరుగా తాలిబ‌న్ల నియంత్ర‌ణ‌లో ఉన్నాయ‌ని చెప్పింది. అఫ్గానిస్థాన్‌లో పాక్ ఉగ్ర‌వాద సంస్థ‌ల కార్య‌క‌లాపాల‌పై ఐక్య‌రాజ్య స‌మితి భ‌ద్ర‌తా మండ‌లి దృష్టి పెట్టాల‌ని నివేదికను రూపొందించిన స‌భ్యులు పేర్కొన్నారు. ఈ మేర‌కు భ‌ద్ర‌తా మండ‌లికి ఓ డాక్యుమెంట్‌ను కూడా వారు పంపారు. పాక్ ఆధారిత ఉగ్ర‌వాద సంస్థ‌లు అఫ్గాన్‌లో కార్య‌క‌లాపాలు నిర్వ‌హిస్తుండ‌డంతో వాటి ద్వారా భార‌త్‌పై పాకిస్థాన్ కుట్ర‌లు ప‌న్నే ప్ర‌మాద‌మూ ఉంద‌న్న ఆందోళ‌న‌లు నెల‌కొన్నాయి.