New Jersey : అమెరికాలో భారతీయ సంతతికి చెందిన కుటుంబం అనుమానాస్పద మృతి .. విచారిస్తున్న పోలీసులు

అమెరికాలో భారతీయ సంతతికి చెందిన కుటుంబం అనుమానాస్పద స్థితిలో మరణించింది. హత్య కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

New Jersey : అమెరికాలో భారతీయ సంతతికి చెందిన కుటుంబం అనుమానాస్పద మృతి .. విచారిస్తున్న పోలీసులు

New Jersey

New Jersey : యుఎస్‌లో భారతీయ సంతతికి చెందిన దంపతులు, వారి కుమారుడు, కుమార్తె ఇంట్లో శవమై కనిపించారు. ఎవరో హత్య చేసినట్లుగా అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

World Top Universities: వరల్డ్ బెస్ట్ యూనివర్సిటీల్లో అమెరికా హవా.. నంబర్ 1 ర్యాంక్ మాత్రం..

అమెరికాలోని న్యూజెర్సీలో భారతీయ సంతతికి చెందిన జంటతో పాటు వారి ఇద్దరు పిల్లలు తమ ఇంట్లో శవమై కనిపించడం సంచలనం కలిగించింది. ఎవరో హత్య చేసి ఉంటారని అనుమానిస్తున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తేజ్ ప్రతాప్ సింగ్ (43), సోనాల్ పరిహార్ (42), పదేళ్ల కుమారుడు, ఆరేళ కుమార్తె చనిపోయి ఉన్నట్లు ప్లెయిన్స్‌బోరో పోలీస్ డిపార్ట్ మెంట్ తెలిపింది.

Iran: కేవలం 12 రోజుల్లో ఇరాన్ వద్ద అణ్వాయుధాలు.. సంచలన ప్రకటన చేసిన అమెరికా

అక్టోబర్ 4 న ప్లెయిన్స్‌బోరోలోని ఓ ఇంట్లో నలుగురు చనిపోయి ఉన్నట్లు పోలీసులకు కాల్ వచ్చింది. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. మరోవైపు తేజ్ ప్రతాప్ సింగ్ కుటుంబ సభ్యులు వారు ఎంతో సంతోషంగా ఉండేవారని ఈ ఘటన ఎలా జరిగిందో అర్ధం కావట్లేదని ఆవేదన వ్యక్తం చేసారు. సింగ్‌తో పాటు పరిహార్ కూడా ఐటీ రంగంలో పనిచేస్తోందని తెలుస్తోంది. ఇరుగుపొరుగు వారు కూడా సింగ్ ఫ్యామిలీ ఎంతో స్నేహంగా ఉండేవారని చెబుతున్నారు. అయితే వీరు బలవన్మరణానికి పాల్పడ్డారా? ఎవరైనా వారిపై దారుణానికి పాల్పడ్డారా? అనేది విచారణలో తేలాల్సి ఉంది.