Omicron : మరో దేశానికి పాకిన కరోనా కొత్త వేరియంట్..

కరోనావైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతోంది. క్రమంగా అన్ని దేశాలకు వ్యాపిస్తోంది. దక్షిణాఫ్రికాలో తొలుత వెలుగుచూసిన ఒమిక్రాన్ ఆ తర్వాత..

Omicron : మరో దేశానికి పాకిన కరోనా కొత్త వేరియంట్..

Omicron

Omicron : కరోనావైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతోంది. క్రమంగా అన్ని దేశాలకు వ్యాపిస్తోంది. దక్షిణాఫ్రికాలో తొలుత వెలుగుచూసిన ఒమిక్రాన్ ఆ తర్వాత బోట్స్ వానా, బెల్జియం, హాంకాంగ్, ఇజ్రాయల్ దేశాల్లో బయటపడింది. తాజాగా ఆ జాబితాలో బ్రిటన్ చేరింది. ఇద్దరు వ్యక్తుల్లో ఒమిక్రాన్ గుర్తించినట్లు బ్రిటన్ అధికారులు తెలిపారు. దీంతో బ్రిటన్ ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. వ్యాక్సినేషన్ వేగాన్ని పెంచింది. సౌతాఫ్రికా నుంచి బ్రిటన్ వచ్చిన ఇద్దరు వ్యక్తుల్లో ఒమిక్రాన్ గుర్తించారు.

తగ్గిందనుకున్న కరోనా మహమ్మారి మళ్లీ బుసలు కొడుతోంది. తాజాగా రూపం మార్చుకుని జనాలపై దాడికి సిద్ధమవుతోంది. దక్షిణాఫ్రికాలో బీ 1.1.529 కరోనా వేరియంట్ ను గుర్తించారు. 32 మ్యుటేషన్లు ఉన్న ఈ వేరియంట్ కు ‘ఒమిక్రాన్’గా పేరు పెట్టారు. దీన్ని ప్రమాదకరమైన వేరియంట్ గా వైద్య నిపుణులు గుర్తిస్తున్నారు. ఈ వేరియంట్ చాలా వేగంగా వ్యాప్తి చెందే లక్షణం కలిగి ఉంటుంది. దక్షిణాఫ్రికాతో పాటు హాంకాంగ్, బోట్స్ వానా దేశాల్లో ఈ వేరియంట్ కనిపించింది. ఆ తర్వాత బెల్జియం, ఇజ్రాయెల్, ఇప్పుడు బ్రిటన్ దేశాల్లో కూడా ఈ వేరియంట్ వెలుగు చూడటంతో ప్రపంచ దేశాలు ఉలిక్కిపడ్డాయి. ఈ వేరియంట్ ను గుర్తించిన దేశాలపై ఆంక్షలకు సిద్ధమవుతున్నాయి.

UAN-Aadhar Link : పీఎఫ్ ఖాతాదారులకు అలర్ట్.. వెంటనే ఆ పని చేయండి.. లేదంటే డబ్బులు రావు

ప్రమాదకరమైన ఒమిక్రాన్ వేరియంట్ నేపథ్యంలో దక్షిణాఫ్రికాపై పలు దేశాలు ఆంక్షలు విధిస్తున్నాయి. దక్షిణాఫ్రికా నుంచి వచ్చే ప్రయాణికులపై నిషేధం విధించేందుకు యూరోపియన్ దేశాలతో పాటు జపాన్, సింగపూర్, ఇజ్రాయెల్ దేశాలు సిద్ధమవుతున్నాయి. మరోవైపు మన దేశంలో విదేశాల నుంచి వస్తున్న ప్రయాణికులకు ఎయిర్ పోర్టుల్లో పక్కాగా వైద్య పరీక్షలను నిర్వహిస్తున్నారు.

కరోనా వైరస్‌ మరో కొత్త రూపంలో మానవాళిని భయాందోళనకు గురిచేస్తోంది. దక్షిణాఫ్రికా సహా పలు దేశాల్లో ఒమిక్రాన్‌ అనే కొత్త వేరియంట్‌ విరుచుకుపడుతోంది. డెల్టా కంటే ప్రమాదకరమైన ఈ కొత్త రకం వైరస్‌తో అప్రమత్తంగా ఉండాలని ఆగ్నేయాసియా దేశాలను ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) హెచ్చరించింది. నిఘా పెంచాలని, ప్రజారోగ్య వ్యవస్థల్ని బలోపేతం చేయాలని ఆగ్నేయాసియా ప్రాంత డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్‌ డాక్టర్‌ పూనం ఖేత్రపాల్‌ సింగ్‌ సూచించారు.

కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ని మరింత వేగవంతం చేయడంతో పాటు వైరస్‌ వ్యాప్తికి అవకాశం లేకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని తెలిపారు. పండుగలు, ఇతర వేడుకల్ని కొవిడ్‌ నిబంధనలకు లోబడి నిర్వహించుకోవాలని, భౌతికదూరం పాటించడంతో పాటు జనసమూహాలకు దూరంగా ఉండాలని ఆమె సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కొవిడ్ నిబంధనల పట్ల అలసత్వం ప్రదర్శించరాదన్నారు.

Microsoft Free Trick : ఈ ట్రిక్‌తో MS Office సాఫ్ట్‌వేర్ ఉచితంగా యాక్సస్ చేసుకోవచ్చు.. ఇదిగో ప్రాసెస్..!

వైరస్‌ ముప్పు నుంచి రక్షణ పొందేందుకు ప్రతి ఒక్కరూ ముక్కు, నోటిని కప్పి ఉంచేలా మాస్కులు ధరించడం, భౌతికదూరం పాటించడం, జనసమూహాలకు దూరంగా ఉండటం, చేతుల్ని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవడం, వెలుతురు లేని గదులకు దూరంగా ఉండటం, వ్యాక్సినేషన్‌ వేయించుకోవడం వంటివి కచ్చితంగా పాటించాలని నిపుణులు సూచించారు.