6 richest women : భారత్ లో ధనిక మహిళలు..ఫస్ట్ ప్లేస్ లో సావిత్రి జిందాల్

భారతీయ శ్రీమంతుల టాప్ 100 ఫోర్బ్స్ లిస్టులో ఆరుగురు మహిళలు స్థానం దక్కించుకున్నారు. టాప్ ఆరుగురు మహిళల్లో తొలిస్థానంలో ఓపీ జిందాల్ గ్రూపుకు చెందిన సావిత్రిజిందాల్ దక్కించుకున్నారు.

6 richest women : భారత్ లో ధనిక మహిళలు..ఫస్ట్ ప్లేస్ లో సావిత్రి జిందాల్

6 Women Are In Top 100 Richest Indian List

6 women are in top 100 richest Indian list : భారతీయ శ్రీమంతుల టాప్ 100 ఫోర్బ్స్ లిస్టులో ఆరుగురు మహిళలు స్థానం దక్కించుకున్నారు. వీరిలో టాప్ ఆరుగురు మహిళల్లో తొలిస్థానంలో ఓపీ జిందాల్ గ్రూపుకు చెందిన సావిత్రి జిందాల్ దక్కించుకున్నారు. ఆమె సంపదను రూ. 13.46 లక్షల కోట్లుగా అంచనా వేశారు. గత ఏడాది ఆమె సంపద విలువ రూ. 9.72 లక్షల కోట్లు. మొత్తం జాబితా విషయానికి వస్తే 71 ఏళ్ల సావిత్రి జిందాల్ ఏడవ స్థానంలో నిలిచారు.రెండో రిచ్ ఉమెన్ గా వినోద్ రాయ్ గుప్తా నిలిచారు. హావెల్స్ ఇండియా సంస్థకు చెందిన ఆమె వయసు 76 ఏళ్లు. రూ. 5.68 లక్షల కోట్లతో ఆమె మొత్తం జాబితాలో 24వ స్థానంలో నిలిచారు.

Read more : Forbes list :ఫోర్బ్స్ జాబితాలో ఐదుగురు భారతీయ మహిళలు..6వ స్థానంలో జయశ్రీ ఉల్లాల్

మూడో స్థానంలో యూఎస్వీ ప్రైవేట్ లిమిటెడ్ (ఫార్మా, బయోటెక్నాలజీ)కు చెందిన 43 ఏళ్ల లీనా తివారీ ఉన్నారు. టాప్ 100 జాబితాలో ఆమె 43వ ర్యాంకు సాధించారు. ఆమె ఆస్తుల విలువ దాదాపు రూ. 3.28 లక్షల కోట్లు. అత్యంత సంపన్న నాలుగో భారతీయ మహిళగా బైజూస్ కో ఫౌండర్ 35 ఏళ్ల దివ్య గోకుల్ నాథ్ నిలిచారు. రూ. 7,477 కోట్ల సంపదతో టాప్ 100 జాబితాలో ఆమె 47వ స్థానంలో నిలబడ్డారు.ఐదవ స్థానాన్ని బయోకాన్ కు చెందిన 68 ఏళ్ల కిరణ్ మజుందార్ షా సొంతం చేసుకున్నారు. ఆమె ఆస్తుల విలువ రూ. 2.91 లక్షల కోట్లు. ఇక ఆరో స్థానంలో ట్రాక్టర్స్ అండ్ ఫామ్ ఎక్విప్ మెంట్ లిమిటెడ్ (టీఏఎఫ్ఈ)కి చెందిన మల్లిక శ్రీనివాసన్ నిలిచారు. ఆమె ఆస్తుల విలువ దాదాపు రూ. 2.16 లక్షల కోట్లు. మొత్తం జాబితాలో ఆమె 73వ స్థానంలో నిలిచారు.

కాగా..సావిత్రి జిందాల్ ఉక్కు, విద్యుత్, సిమెంట్, మౌలిక సదుపాయాల పరిశ్రమలో ఉన్న జిందాల్ గ్రూప్ ఛైర్‌పర్సన్. ఈ సంస్థ వ్యవస్థాపకుడైన తన భర్త ఓం ప్రకాష్ జిందాల్ మరణం తర్వాత ఆమె ఈ బాధ్యతలు స్వీకరించారు. కంపెనీలోని డిపార్ట్ మెంట్స్ లను ఆమె నలుగురు కుమారులు నిర్వహిస్తున్నారు. అయినప్పటికీ, ఆమె బాధ్యతలు స్వీకరించిన తర్వాత కంపెనీ ఆదాయం నాలుగు రెట్లు పెరిగటం గమనించాల్సిన విషయం. సావిత్రి జిందాల్ కూడా రాజకీయాల్లో తనదైన శైలిలో వెలిగారు. 2013 లో హర్యానా క్యాబినెట్ మంత్రిగా పనిచేశారు. రెవెన్యూ, విపత్తు నిర్వహణ, కన్సాలిడేషన్, పునరావాసం,గృహ సహాయ మంత్రిగాను, పట్టణ సహాయ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు.