Hyderabad: 7 రోజుల చిన్నారి.. 3 వేలకు అమ్మకం పెట్టిన తల్లి!

నవమాసాలు మోసి కన్న బిడ్డను దారుణంగా అమ్మేసింది ఓ తల్లి. ముక్కుపచ్చలారని ఆ పసికందును దారుణంగా మూడు వేలరూపాయలకు బేరం పెట్టింది. ఫలితంగా భూమి మీద పడి నిండా వారం గడవకుండానే ఆ చిన్నారి తల్లికి దూరమైంది. ఈ అమానుష ఘ‌ట‌న‌ హైదరాబాద్ న‌గ‌రంలోని బాచుప‌ల్లిలో వెలుగు చూసింది.

Hyderabad: 7 రోజుల చిన్నారి.. 3 వేలకు అమ్మకం పెట్టిన తల్లి!

Hyderabad

Hyderabad: నవమాసాలు మోసి కన్న బిడ్డను దారుణంగా అమ్మేసింది ఓ తల్లి. ముక్కుపచ్చలారని ఆ పసికందును దారుణంగా మూడు వేలరూపాయలకు బేరం పెట్టింది. ఫలితంగా భూమి మీద పడి నిండా వారం గడవకుండానే ఆ చిన్నారి తల్లికి దూరమైంది. ఈ అమానుష ఘ‌ట‌న‌ హైదరాబాద్ న‌గ‌రంలోని బాచుప‌ల్లిలో వెలుగు చూసింది. రాధ అనే మ‌హిళ త‌న భ‌ర్త‌తో క‌లిసి స్థానికంగా ఓ గుడిసెలో నివాసం ఉంటున్నారు.

కూలీపని చేసుకుంటూ బ్రతికే ఈ దంపతులకు ఏడు రోజుల క్రితం ఆడ శిశువుకు జ‌న్మ‌నిచ్చింది. ఏమైందో ఏమో కానీ భూమి మీదపడిన మూడు రోజులకే చిన్నారిని స్థానికంగా ఉన్న శాంత‌మ్మ అనే మ‌హిళ‌కు రూ.3 వేల‌కు విక్ర‌యించింది. ఆ తర్వాత మరో మూడు రోజులకు మళ్ళీ తన బిడ్డ తనకు కావాలని చిన్నారిని కొనుకున్న మహిళా వద్దకు వెళ్లి తన బిడ్డను తిరిగి ఇచ్చేయాలని కోరింది.

కానీ అందుకు ఆ మహిళ ఒప్పుకోలేదు. కన్న తల్లి బ్రతిమాలడంతో పదివేల రూపాయలిస్తే బిడ్డను తిరిగిచ్చేస్తాని చెప్పింది. దీంతో అంత డబ్బు ఇవ్వలేని ఆ తల్లి దిక్కు తోచ‌ని స్థితిలో రాధ స్థానిక అంగ‌న్‌వాడీ టీచ‌ర్‌ను ఆశ్ర‌యించింది. అంగ‌న్‌వాడీ టీచ‌ర్ పోలీసుల‌కు స‌మాచారం ఇవ్వడంతో పోలీసులు శిశువును సంరక్షణలోకి తీసుకొని విచారణ చేపట్టారు.