Actor Manobala : తమిళ్ స్టార్ కమెడియన్స్ మనోబాల, వడివేలు మధ్య ఉన్న గొడవ ఏంటో తెలుసా?

తమిళ సినీ నటుడు మనోబాల ఈరోజు (మే 3) కన్నుమూశారు. అయితే ఆయనకి, స్టార్ కమెడియన్ వడివేలుకు మధ్య ఉన్న గొడవ ఏంటో తెలుసా?

Actor Manobala : తమిళ్ స్టార్ కమెడియన్స్ మనోబాల, వడివేలు మధ్య ఉన్న గొడవ ఏంటో తెలుసా?

Actor Manobala controversy with Vadivelu story comedian

Actor Manobala : తమిళ సినీ నటుడు మనోబాల ఈరోజు (మే 3) కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన చికిత్స పొందుతూ వస్తున్నారు. నేడు తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. కమెడియన్‌గా స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న మనోబాల.. దర్శకుడిగా కూడా ఎన్నో సినిమాలు చేశారు. అంతేకాదు ప్రొడ్యూసర్‌గా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా, సీరియల్ యాక్టర్ గా కూడా అలరించారు. అలాగే ‘వేస్ట్ పేపర్’ అనే పేరుతో ఒక యూట్యూబ్ ఛానెల్‌ని కూడా నిర్వహిస్తున్నారు.

Actor Manobala: సినీ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ కమెడియన్ మనోబాల కన్నుమూత

ఇక పలువురు సినీ తారలను ఆ యూట్యూబ్ ఛానెల్‌ ద్వారా ఇంటర్వ్యూలు చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే నటుడు సింగముత్తుని ఇంటర్వ్యూ చేశారు. ఆ ఇంటర్వ్యూలో నటుడు సింగముత్తు.. స్టార్ కమెడియన్ వడివేలు (Vadivelu) పై కొన్ని వ్యాఖ్యలు చేశారు. వాటిని ఖండిస్తూ సింగముత్తు, మనోబాల పై వడివేలు నడిగర్ సంఘంలో ఫిర్యాదు చేశాడు. ఇంటర్వ్యూలో తన పరువుకు భంగం కలిగేలా మాట్లాడడమే కాకుండా అందుకు సంబంధించిన వీడియోని నడిగర్ సంఘం వాట్సాప్ గ్రూప్‌ లో షేర్ చేశారంటూ, వారిద్దరి పై తక్షణమే చర్యలు తీసుకోవాలని వడివేలు పేర్కొన్నారు.

Vikram : తంగ‌లాన్ షూట్ లో.. విక్ర‌మ్ కి తీవ్ర‌గాయాలు

ఇక ఈ విషయం పై మనోబాల స్పందిస్తూ వడివేలుకు బహిరంగంగా క్షమాపణ చెప్పారు. వడివేలుతో తన స్నేహం 30 ఏళ్లదని, ఆ స్నేహని వదులుకోవడం తనకి ఇష్టం లేదని చెబుతూ వడివేలుకు క్షమాపణ చెప్పారు. ఇండస్ట్రీలో వివాదాలకు ఎప్పుడు తాను దూరంగానే ఉంటానని, వడివేలు మళ్ళీ సినిమాల్లో నటిస్తే చూడాలని ఉందని కోరుకునే వ్యక్తులు తాను ఒకడని, వడివేలు అలా ఎందుకు ఫిర్యాదు చేశారో తనకి అర్ధం కాలేదని మనోబాల చెప్పుకొచ్చారు. అయితే వడివేలు అలా ఫిర్యాదు చేయడానికి కారణం.. సింగముత్తు తనకి మధ్య ఉన్న గొడవలే కారణమని తెలుస్తుంది. ఆస్తుల విషయంలో వారిద్దరూ ఒకరి పై ఒకరు కేసులు పెట్టుకున్నారు. ఇక ఆ ఆ ఇంటర్వ్యూలో సింగముత్తు వడివేలు పై ఇష్టమొచ్చినట్లు కామెంట్స్ చేయడంతో వడివేలు కోపంతో అలా చేశారని సమాచారం.