Siddharth : దోచుకుంటోంది రాజకీయ నేతలే..! ముందు మీ అవినీతి తగ్గించుకోండి

నానికి మద్దతుగా హీరో సిద్ధార్థ్ చేసిన ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది..

Siddharth : దోచుకుంటోంది రాజకీయ నేతలే..! ముందు మీ అవినీతి తగ్గించుకోండి

Siddharth

Siddharth: సినిమా పరిశ్రమకు చుక్కలు చూపిస్తోంది ఏపీ ప్రభుత్వం. పాండమిక్ వల్ల సినిమా పరిశ్రమతో పాటు థియేటర్ల ఓనర్స్, పనిచేసే సిబ్బంది ఎన్ని ఇబ్బందులు పడ్డారో కొత్తగా చెప్పక్కర్లేదు. ఇప్పుడిప్పుడే పరిస్థితులు అదుపులోకి వస్తున్నాయి.. మరి కొద్ది రోజుల్లో సినీ ఇండస్ట్రీ మంచి రోజులు రాబోతున్నాయి అని సంబరపడుతున్న మేకర్స్‌కు గట్టి షాక్ తగిలింది.

Botsa Satya Narayana : సామాన్యుడికి అందుబాటులో ఉండాలనే.. హీరో నాని వ్యాఖ్యలకు మంత్రి కౌంటర్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఊహించని విధంగా టికెట్ రేట్లు తగ్గించడంతో పాటు బెన్‌ఫిట్ షోలకు, ఎలాంటి స్పెషల్ షోలకు పర్మిషన్ లేదని తేల్చి చెప్పడంతో కొత్త సినిమాల విడుదల విషయంలో కన్ఫ్యూజన్ నెలకొంది.. క్రిస్మస్, న్యూఇయర్, సంక్రాంతి సీజన్‌లో పెద్ద మొత్తంలో ప్రేక్షకులు థియేటర్లకు వస్తారని ఆశించిన నిర్మాతలు, థియేటర్ల యజమానులకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది ఏపీ ప్రభుత్వం.

నిబంధనలను ఉల్లంఘించారంటూ పలు థియేటర్లను అధికారులు సీజ్ చేశారు. గవర్నమెంట్ నిర్ణయించిన ఈ టికెట్ రేట్లతో సినిమాలు ఆడించలేమని థియేటర్ యజమానులు హాళ్లు క్లోజ్ చేసేశారు. టికెట్ రేట్ల గురించి హీరో నాని చేసిన వ్యాఖ్యలపై పలువురు ఏపీ రాజకీయనాయకులు ఫైర్ అయ్యారు.

అయితే నానికి మద్దతుగా హీరో సిద్ధార్థ్ చేసిన ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది. సినిమా టికెట్ రేట్ల గురించి డిస్కౌంట్ల గురించి మాట్లాడుతున్న మంత్రలపై ట్విట్టర్ ద్వారా ఫైర్ అయ్యారాయన. ‘మేం మీకు ట్యాక్సులు కడుతున్నాం. మీ లగ్జరీలన్నిటికీ మేం చెల్లిస్తున్నాం. లక్షల కోట్లు రాజకీయ నాయకులు అవినీతితో సంపాదించారు. మీ లగ్జరీలను తగ్గించుకోండి.. మాకు డిస్కౌంట్ ఇవ్వండి’ అంటూ #whatLOGIC అనే హ్యాష్‌ట్యాగ్‌తో సిద్ధార్థ్ ట్వీట్ చేశారు.