Adipurush : ‘ఆదిపురుష్’ని నైజాంలో రిలీజ్ చేసేది ఎవరో తెలుసా? చాలా మంది పోటీ పడ్డారు.. కానీ..

ఆదిపురుష్ తెలుగు రైట్స్ ని ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ దాదాపు 170 కోట్లకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. సినిమాపై భారీ హైప్ ఉండటంతో ఏకంగా ఇన్ని కోట్లకు తెలుగు రైట్స్ అమ్ముడుపోయాయి. నైజాం, ఆంధ్ర, సీడెడ్ అన్ని ఏరియాల్లోను సినిమాకు బాగా బిజినెస్ జరుగుతున్నట్టు సమాచారం.

Adipurush : ‘ఆదిపురుష్’ని నైజాంలో రిలీజ్ చేసేది ఎవరో తెలుసా? చాలా మంది పోటీ పడ్డారు.. కానీ..

Adipurush Movie Distributes in Nizam by Mythri Movie Distributors

Adipurush Nizam Distributors :  నిన్న జూన్ 6న ఆదిపురుష్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని తిరుపతి (Tirupati) శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో భారీగా నిర్వహించారు. ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చినజీయర్ స్వామి ముఖ్య అతిథిగా విచ్చేశారు. దాదాపు లక్ష మందికి పైగా అభిమానులు,ప్రేక్షకులు ఈ ఈవెంట్ కి హాజరయ్యారు. ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎవరూ ఊహించనంత గ్రాండ్ గా జరిగింది.

ఓం రౌత్ (Om Raut) దర్శకత్వంలో ప్రభాస్ (Prabhas) రాముడిగా, కృతి సనన్ (Kriti Sanon) సీతగా, సైఫ్ అలీఖాన్ (Saif Alikhan) రావణాసురుడిగా తెరకెక్కిన ఆదిపురుష్ సినిమా జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజయిన ట్రైలర్, సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ రావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమా రిలీజ్ కోసం అభిమానులతో పాటు దేశవ్యాప్తంగా ప్రేక్షకులు కూడా ఎదురు చూస్తున్నారు.

ఆదిపురుష్ తెలుగు రైట్స్ ని ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ దాదాపు 170 కోట్లకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. సినిమాపై భారీ హైప్ ఉండటంతో ఏకంగా ఇన్ని కోట్లకు తెలుగు రైట్స్ అమ్ముడుపోయాయి. నైజాం, ఆంధ్ర, సీడెడ్ అన్ని ఏరియాల్లోను సినిమాకు బాగా బిజినెస్ జరుగుతున్నట్టు సమాచారం. తాజాగా నైజాంలో ఆదిపురుష్ సినిమా హక్కుల కోసం చాలా మంది పోటీ పడ్డా ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నైజాం రైట్స్ చేజిక్కించుకుంది. దీంతో నైజాంలో మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఆదిపురుష్ ని రిలీజ్ చేయబోతున్నారు.

Prabhas & Kriti Sanon : సీతా రామ్.. ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ప్రభాస్, కృతి సనన్ ఫొటోలు.. ఎంత చక్కగా ఉందో జంట..

ఈ సంవత్సరం సంక్రాంతికి తమ సినిమాలు వాల్తేరు వీరయ్య, వీరసింహ రెడ్డి సినిమాలతో మైత్రి సంస్థ డిస్ట్రిబ్యూషన్ కూడా మొదలుపెట్టింది. అప్పట్నుంచి చాలానే సినిమాలు రిలీజ్ చేసింది. కొన్ని చిన్న సినిమాలను కూడా ఎంకరేజ్ చేస్తూ రిలీజ్ చేసింది. ఇప్పుడు అత్యంత ప్రతిషాత్మకమైన సినిమా ఆదిపురుష్ నైజాం హక్కులను మైత్రి భారీ ధరకు సొంతం చేసుకుంది. ఈ విషయాన్ని మైత్రి సంస్థ అధికారికంగా ప్రకటించింది. మరి ఆదిపురుష్ మైత్రి సంస్థకి ఏ రేంజ్ లాభాలు ఇస్తుందో చూడాలి. ఇక అభిమానులు బెనిఫిట్ షోలు, ప్రీమియర్ షోలు వేయమని మైత్రి సంస్థకు కామెంట్స్, మెసేజెస్ చేస్తున్నారు.