Airtel 5G Plus Services : దేశవ్యాప్తంగా ఎయిర్టెల్ 5G సర్వీసులు.. కొత్తగా చేరిన మరో నగరం.. మీరు ఈ నగరంలో ఉన్నారో లేదో చెక్ చేసుకోండి..!
Airtel 5G Plus Services : దేశీయ టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్టెల్ (Airtel) మహారాష్ట్రలోని పూణెలో 5G Plus సర్వీసులను అందుబాటులోకి తెచ్చింది. ఇప్పటినుంచి పూణే నివాసులు ఎలాంటి అదనపు ఖర్చు లేకుండా ఎయిర్టెల్ 5G సర్వీసులను యాక్సెస్ చేసుకోవచ్చు.
Airtel 5G Plus Services : దేశీయ టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్టెల్ (Airtel) మహారాష్ట్రలోని పూణెలో 5G Plus సర్వీసులను అందుబాటులోకి తెచ్చింది. ఇప్పటినుంచి పూణే నివాసులు ఎలాంటి అదనపు ఖర్చు లేకుండా ఎయిర్టెల్ 5G సర్వీసులను యాక్సెస్ చేసుకోవచ్చు. దేశవ్యాప్తంగా ఎయిర్టెల్ 5G NSA (నాన్-స్టాండలోన్) నెట్వర్క్ను విస్తరిస్తోంది. 4G ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నందున నెట్వర్క్ వేగంగా ఉంటుందని భావిస్తున్నారు.
టెలికాం ప్రకారం.. ఎయిర్టెల్ 5G ప్లస్ (Airtel 5G Services) సర్వీసులను పొందిన కొన్ని ప్రాంతాలు కోరేగావ్ పార్క్, కళ్యాణి నగర్, బానేర్, హింజేవాడి, మగర్పట్టా, హదప్సర్, ఖరాడీ, మోడల్ కాలనీ, స్వర్గేట్, పింప్రి-చించ్వాడ్ వంటి కొన్ని ఇతర ప్రదేశాలు ఉన్నాయి. వాస్తవానికి, పూణేలోని మరిన్ని ప్రాంతాలు దశలవారీగా కంపెనీ 5G సర్వీసులను పొందుతాయని ఎయిర్టెల్ వెల్లడించింది.
భారతీ ఎయిర్టెల్, మహారాష్ట్ర, గోవా CEO జార్జ్ మాథెన్ మాట్లాడుతూ.. పూణెలో ఎయిర్టెల్ 5G ప్లస్ (Airtel 5G Plus in Pune)ను ప్రారంభించినందుకు చాలా సంతోషంగా ఉంది. Airtel కస్టమర్లు ఇప్పుడు అల్ట్రాఫాస్ట్ (UltraFast) నెట్వర్క్ను పొందవచ్చు. ప్రస్తుత 4G స్పీడ్ కన్నా 20-30 రెట్లు ఎక్కువ స్పీడ్ పొందవచ్చు.
హై-డెఫినిషన్ వీడియో స్ట్రీమింగ్, గేమింగ్, మల్టిపుల్ చాటింగ్, ఫోటోల ఇన్స్టంట్ అప్లోడ్, మరిన్నింటికి సూపర్ఫాస్ట్ యాక్సెస్ను పొందడానికి కస్టమర్లను అనుమతించనుంది. టెలికమ్యూనికేషన్స్ సర్వీస్ ప్రొవైడర్ భారతీ ఎయిర్టెల్ ఇటీవల వారణాసిలోని లాల్ బహదూర్ శాస్త్రి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో 5G ప్లస్ సర్వీసులను అమలు చేసినట్లు తెలిపింది.
బెంగుళూరు, పూణేలోని కొత్త గార్డెన్ టెర్మినల్తో సహా మరో రెండు విమానాశ్రయాలలో కూడా Airtel తన 5G ప్లస్ సర్వీసులను ప్రారంభించింది. 5G స్మార్ట్ ఫోన్లను కలిగిన కస్టమర్లందరూ తమ ప్రస్తుత డేటా ప్లాన్లలో హైస్పీడ్ ఎయిర్టెల్ 5G ప్లస్ని పొందవచ్చు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న Airtel 4G SIMలోనే 5G యాక్సస్ చేసుకోవచ్చు.
5G నెట్వర్క్ కోసం ప్రత్యేకించి SIM మార్చవలసిన అవసరం లేదని కంపెనీ తెలిపింది. ఇప్పటికే ఎయిర్టెల్ 5G ప్లస్ సర్వీసులను ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, సిలిగురి, నాగ్పూర్, వారణాసి, పానిపట్, గురుగ్రామ్ అంతటా గ్రేడెడ్ పద్ధతిలో అందించడం ప్రారంభించింది. ఎయిర్టెల్ 5G ప్లస్ సర్వీసులను పొందిన దేశంలోని మొదటి 8 నగరాల్లో వారణాసి ఒకటిగా నిలిచింది. ఈ 5G సర్వీసులు ప్రస్తుతం బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం (BHU), ఘాట్ రోడ్, అడంపూర్, బెనియా బాగ్ కాశీ విశ్వనాథ దేవాలయం, రాజ్ఘాట్, సారనాథ్, సిగ్రా, తాతేరి బజార్ సహా కొన్ని ఇతర ప్రదేశాలలో అందుబాటులో ఉన్నాయి.
WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..