Aishwaryaa Rajinikanth : మరోసారి ఆస్పత్రిపాలైన ధనుష్ మాజీ భార్య ఐశ్వర్య

తాజాగా మరోసారి ఐశ్వర్య హాస్పిటల్ లో చేరింది. ఈ మేరకు తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టింది. హాస్పిటల్ లో డాక్టర్ తో ఉన్న ఫోటోని షేర్ చేస్తూ..''జీవితం కరోనాకు ముందు, ఆ తర్వాత.....

Aishwaryaa Rajinikanth : మరోసారి ఆస్పత్రిపాలైన ధనుష్ మాజీ భార్య ఐశ్వర్య

Aishwarya

Aishwaryaa Rajinikanth :   సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ కుమార్తె, ధనుష్ మాజీ భార్య ఐశ్వర్య మరోసారి ఆసుపత్రి పాలైంది. గత కొద్ది రోజుల క్రితం ధనుష్-ఐశ్వర్య విడాకులు తీసుకున్న సంగతి అందరికి తెలిసిందే. ఆ తర్వాత కరోనా సోకడంతో ఐశ్వర్య హాస్పిటల్ లో చేరింది. ఇక కరోనా తగ్గాక తన వర్క్స్ తో బిజీగా ఉంది ఐశ్వర్య. ఇక ధనుష్ కూడా తన షూటింగ్స్ తో బిజీగా ఉన్నాడు.

 

తాజాగా మరోసారి ఐశ్వర్య హాస్పిటల్ లో చేరింది. ఈ మేరకు తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టింది. హాస్పిటల్ లో డాక్టర్ తో ఉన్న ఫోటోని షేర్ చేస్తూ..”జీవితం కరోనాకు ముందు, ఆ తర్వాత అన్నట్లుగా ఉంది. జ్వరం, వర్టిగోతో మరోసారి నేను ఆసుపత్రిలో చేరాను. కానీ ఇలాంటి టైములో ఓ మంచి, స్ఫూర్తినిచ్చే డాక్టర్ మన పక్కన ఉంటే ఈ బాధ ఎక్కువగా ఉండదు. ఈ ఉమెన్స్ డే ని ఇంత మంచి వారితో మొదలు పెట్టినందుకు ఆనందంగా ఉంది. థ్యాంక్ యు మేడం” అంటూ డాక్టర్ గురించి, తన గురించి పోస్ట్ చేసింది.

Samantha : నాగచైతన్యకి పోటీగా కొత్త బిజినెస్ లోకి అడుగుపెట్టిన సమంత

అలాగే హాస్పిటల్ లో ఉన్న నర్సులతో ఫోటో దిగి ఆ ఫోటోని పోస్ట్ చేస్తూ ఉమెన్స్ డే శుబాకాంక్షలు తెలిపింది ఐశ్వర్య. హాస్పిటల్ లో నర్సులంతా తన చుట్టూ కూర్చోగా తాను కింద కూర్చొని ఉన్న ఫోటోని షేర్ చేసి వారి గొప్పతనాన్ని వివరిస్తూ పోస్ట్ చేసింది. ఇక తన అభిమానులు అమె త్వరగా కోలుకోవాలని కామెంట్స్ చేస్తున్నారు.