Allari Naresh : ఓట్ల కోసం నరేష్ ప్రయాణం.. ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం టీజర్ రిలీజ్..

నరేష్ 59వ సినిమాగా 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం' అనే టైటిల్ తో సినిమాని అనౌన్స్ చేశారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశల్లో ఉంది. దీనికోసం అడవుల్లోకి వెళ్లి.......

Allari Naresh : ఓట్ల కోసం నరేష్ ప్రయాణం.. ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం టీజర్ రిలీజ్..

Allari Naresh

Allari Naresh :  కామెడీ హీరోగా పేరు తెచ్చుకున్న అల్లరి నరేష్ గతంలోనే నేను, గమ్యం..లాంటి పలు సినిమాలతో కంటెంట్ సినిమాలు కూడా తీయగలను, ఎలాంటి పాత్ర అయినా పోషించగలను అని నిరూపించారు. ఇటీవల కొన్ని సినిమాలు వరుసగా ఫ్లాప్ అయ్యాయి ఆ సమయంలో మళ్ళీ తనలోని నటుడ్ని బయటకి తీసి కంటెంట్ ఆధారంగా నాంది అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చి భారీ విజయంతో కంబ్యాక్ ఇచ్చాడు.

దీంతో మరోసారి కంటెంట్ సినిమాతోనే రాబోతున్నాడు. నరేష్ 59వ సినిమాగా ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ అనే టైటిల్ తో సినిమాని అనౌన్స్ చేశారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశల్లో ఉంది. దీనికోసం అడవుల్లోకి వెళ్లి మరీ షూట్ చేస్తున్నారు చిత్ర యూనిట్. ఇవాళ గురువారం అల్లరి నరేష్ పుట్టిన రోజు కావడంతో తాజాగా ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ అనే సినిమా టీజర్ ని రిలీజ్ చేశారు.

Tollywood Heros : టాలీవుడ్ హీరోలని టార్గెట్ చేసిన బాలీవుడ్ ఆడియన్స్.. ట్రోల్స్ తో హడావిడి..

ఈ టీజర్ లో మారేడుమిల్లి అనే ఓ ఊరు ప్రపంచానికి దూరంగా, కనీస అవసరాలు లేకుండా అడవుల మధ్యలో బతుకుతూ ఉంటుంది. అక్కడికి ఓట్లు వేయించడం కోసం అల్లరి నరేష్ పోలింగ్ అధికారిగా తన టీంతో కలిసి వెళ్తాడు. అక్కడ జరిగిన కొన్ని సంఘటనలు, విలన్ చేసిన కొన్ని పనుల వల్ల అల్లరి నరేష్ ని తప్పుగా భావించి ఆ ఊరి వాళ్ళు, పోలీసులు కొడతారు అన్నట్టు చూపించారు. టీజర్ మొత్తంలోనే అంతర్లీనంగా కథ చెప్పేశారు. మరోసారి నరేష్ కంటెంట్ సినిమాతో వస్తుండటంతో దీనిపై కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి.