Pawan Kalyan : పవన్ కి స్థలం ఇచ్చానని నా ఇల్లు కూలగొట్టారు.. ఇప్పటం గ్రామం పెద్దావిడ ఆవేదన

పవన్ ఇప్పటం గ్రామానికి వెళ్లి అక్కడి గ్రామస్థులని పరామర్శించాడు, ఆర్ధిక సహాయం చేశాడు. అలా పవన్ నుంచి ఆర్ధిక సహాయాన్ని పొందిన ఇప్పటం గ్రామానికి చెందిన ఓ పెద్దావిడ అన్ స్టాపబుల్ షోకి వచ్చి మాట్లాడింది...............

Pawan Kalyan : పవన్ కి స్థలం ఇచ్చానని నా ఇల్లు కూలగొట్టారు.. ఇప్పటం గ్రామం పెద్దావిడ ఆవేదన

An old woman gets emotional on the show when Pawan Kalyan talks about help

Pawan Kalyan :  బాలకృష్ణ హోస్ట్ గా ఆహా ఓటీటీలో అన్‌స్టాపబుల్ షో సూపర్ గా సక్సెస్ అయింది. మొదటి సీజన్ గ్రాండ్ గా సక్సెస్ అవ్వడంతో రెండో సీజన్ కూడా మరింత గ్రాండ్ గా చేశారు. అన్‌స్టాపబుల్ సెకండ్ సీజన్ లో చంద్రబాబు, ప్రభాస్ ఎపిసోడ్స్ హైలెట్ గా నిలవగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ తో అన్‌స్టాపబుల్ షోని మరో రేంజ్ కి తీసుకెళ్లారు. బాలకృష్ణ-పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ ని రెండు పార్టులుగా రిలీజ్ చేస్తామని ప్రకటించి పార్ట్ 1ని ఫిబ్రవరి 2న రిలీజ్ చేశారు ఆహా. ఈ ఎపిసోడ్ ఎక్కువ స్ట్రీమింగ్ టైం సాధించి సరికొత్త రికార్డులని సెట్ చేసింది. ఈ ఎపిసోడ్ లో సరదాగా మాట్లాడుతూ, సినిమాలు, పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడారు. తాజాగా ఫిబ్రవరి 9 గురువారం రాత్రి బాలకృష్ణ – పవన్ కళ్యాణ్ అన్‌స్టాపబుల్ ఎపిసోడ్ పార్ట్ 2 రిలీజ్ చేశారు.

బాలయ్య-పవన్ ఎపిసోడ్ షూటింగ్ మొదలైన దగ్గర్నుంచి అటు బాలయ్య అభిమానులు, ఇటు పవన్ అభిమానులు హంగామా చేశారు. వరుసగా పోస్టర్లు, ఫోటోలు, ప్రోమోలు.. వదులుతూ ఆహా టీం కూడా ఫ్యాన్స్ కి ఫుల్ ట్రీట్ ఇచ్చింది. తాజాగా రిలీజ్ అయిన పవన్ బాలయ్య ఎపిసోడ్ తో ఈ సీజన్ గ్రాండ్ గా ముగిసింది. మొదటి పార్ట్ లో అంతా సినిమాలు, పర్సనల్ లైఫ్ ఉంటే రెండో పార్టీ లో చాలా వరకు పాలిటిక్స్ గురించి ఉంది. దీంతో ఈ ఎపిసోడ్ ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.

 

పవన్ కళ్యాణ్ కొన్ని నెలల క్రితం ఇప్పటం గ్రామంలో జనసేన ఆవిర్భావ సభ నిర్వహించారు. ఈ సభ కోసం అక్కడి గ్రామస్థులు స్థలం ఇచ్చారు. అయితే దీనిపై ఏపీ ప్రభుత్వం ఆ గ్రామంలో పవన్ కి స్థలం ఇచ్చిన వాళ్ళ ఇళ్ళని రోడ్డు వెడల్పు చేస్తున్నాం అనే సాకుతో కూలగొట్టింది అని విమర్శలు వచ్చాయి. దీంతో పవన్ సీరియస్ అయి ఇప్పటం గ్రామానికి వెళ్లి అక్కడి గ్రామస్థులని పరామర్శించాడు, ఆర్ధిక సహాయం చేశాడు. అలా పవన్ నుంచి ఆర్ధిక సహాయాన్ని పొందిన ఇప్పటం గ్రామానికి చెందిన ఓ పెద్దావిడ అన్ స్టాపబుల్ షోకి వచ్చి మాట్లాడింది.

Pawan Kalyan : తెలుగుదేశంలో జాయిన్ అవ్వమన్న బాలయ్య.. పవన్ ఏం చెప్పాడో తెలుసా?

ఆ పెద్దావిడ మాట్లాడుతూ.. ఇప్పటంలో పవన్ కళ్యాణ్ గారికి సభ పెట్టుకోవడానికి మేం పొలాలు ఇచ్చాం. తర్వాత ఒకసారి నా దగ్గరికి వచ్చి మాట్లాడారు. నా కొడుకులు ఇద్దరు కరోనా వచ్చి చనిపోయారు. ఇప్పుడు నాకు ఒక్కడే కొడుకు ఉన్నాడు, ఇతనే నా కొడుకు అంటూ పవన్ ని పట్టుకొని ఎమోషనల్ అయింది. ఆ తర్వాత ఈయని నా కొడుకు అని చెప్పానని మా ఇల్లు పడేసారు. కాని నా కొడుకు వచ్చి నన్ను ఆదుకున్నాడు. ఆ తర్వాత మేము, మా ఊళ్ళో వాళ్లంతా అయ్యగారికి ఏమన్నా ఇవ్వాలని డబ్బులు పోగేసాం. పవన్ కళ్యాణ్ మా అయ్యా దేవుడు, కష్టపడి సంపాదించి ఇచ్చాడు. ఎవరి దగ్గర మోసం చేసి ఇవ్వలేదు. సొంతంగా కష్టపడి ఆయన డబ్బుని మాకు ఇచ్చాడు. ఇప్పటం వాళ్ళ అందరికి పవన్ దేవుడు. మా అయ్యా సీఎం అయ్యాకే నేను చచ్చిపోతా. నన్ను అమ్మ అని పిలిచాడు, ఇలాంటోడు దేశానికి ఒక్కడు ఉన్నా చాలు అంటూ ఎమోషనల్ అయి పవన్ ని పట్టుకొని ఏడ్చింది. దీంతో ఆ పెద్దావిడ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. ఈ వీడియో కూడా సోషల్ మీడియాలో ట్రేండింగ్ అవుతుంది. మరి దీనిపై వైసీపీ వాళ్ళు ఎలా స్పందిస్తారో చూడాలి.