Jayamma Panchayithi : రెండోసారి సింగర్‌గా మారిన యాంకర్ సుమ

'జయమ్మ పంచాయితీ' నుంచి టైటిల్ సాంగ్‌ను డైరెక్టర్ రాజమౌళి రిలీజ్ చేశారు. అయితే ఈ పాటలో సుమ కూడా పాడింది. సింగర్ శ్రీకృష్ణ పాటను పాడగా మద్యలో వచ్చే ఫీమేల్ వాయిస్ ర్యాప్ లాంటి........

Jayamma Panchayithi :  రెండోసారి సింగర్‌గా మారిన యాంకర్ సుమ

Jayamma

Jayamma Panchayithi :   యాంకర్ సుమ రెండు దశాబ్దాలుగా తెలుగు ప్రేక్షకులని బుల్లితెరపై అలరిస్తుంది. అప్పుడప్పుడు సినిమాల్లో కూడా చిన్న చిన్న పాత్రలు చేసి మెప్పిస్తుంది. ప్రస్తుతం తనే మెయిన్ లీడ్ గా ‘జయమ్మ పంచాయితీ’ అనే సినిమా చేస్తుంది. ఈ సినిమా ప్రమోషన్స్ కోసం టాలీవుడ్ స్టార్స్ అందర్నీ వాడేస్తుంది సుమ. ఇప్పటికే ఈ సినిమా నుంచి కొన్ని సాంగ్స్, టీజర్ రిలీజ్ అయి మంచి టాక్ తెచ్చుకున్నాయి. తాజాగా నిన్న మరో సాంగ్ రిలీజ్ చేశారు.

‘జయమ్మ పంచాయితీ’ నుంచి టైటిల్ సాంగ్‌ను డైరెక్టర్ రాజమౌళి రిలీజ్ చేశారు. అయితే ఈ పాటలో సుమ కూడా పాడింది. సింగర్ శ్రీకృష్ణ పాటను పాడగా మద్యలో వచ్చే ఫీమేల్ వాయిస్ ర్యాప్ లాంటి పదాలను సుమ పాడింది. రామజోగయ్య శాస్త్రి ఈ పాటను రాయగా, ఎంఎం కీరవాణి మ్యూజిక్ అందించారు. సుమ ఈ పాటని పోస్ట్ చేస్తూ.. ”ఎంఎం కీరవాణి సంగీత సారథ్యంలోని ఈ పాటకు ఇలా ర్యాప్ పాడటం ఎంతో గౌరవంగా భావిస్తున్నాను. ఈ పాటను అద్భుతంగా ట్యూన్ చేశారు. రామజోగయ్య శాస్త్రి గారు మంచి సాహిత్యాన్ని అందించారు. శ్రీకృష్ణ అద్భుతంగా పాడాడు. జేడీ మాస్టర్ కొరియోగ్రఫీ బాగుందని” సుమ తెలిపింది.

Rashmika Mandanna : ఆ విషయంలో నా ట్రైనర్ నన్ను టార్చర్ చేస్తాడు

అయితే సుమ పాట పాడటం ఇది రెండో సారి. గతంలో ‘విన్నర్’ సినిమాలో ‘సూయ సూయ అనసూయ’ అనే సాంగ్ ని తమన్ మ్యూజిక్ డైరెక్షన్ లో సుమ పాడింది. తాజాగా ఈ పాటతో సుమ రెండో సారి సింగర్‌గా అవతారమెత్తింది. ఇన్నాళ్లు బుల్లితెరని యాంకర్ గా ఏలి ఇప్పుడు మెయిన్ లీడ్ గా సినిమా చేస్తుండటంతో ప్రేక్షకులు ఈ సినిమా గురించి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

View this post on Instagram

A post shared by Suma K (@kanakalasuma)